తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్య గురించి పరిచయం అనవసరం. ఇటీవల రిలీజ్ అయిన బేబీ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన వైష్ణవి చైతన్య సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈమె అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలో, వరుడు కావలెను లాంటి సినిమాలలో సహాయక పాత్రలో కనిపించింది. ఈ అందాల భామ సినిమాలలోకి రాకముందు సాఫ్ట్ వేర్ డెవలపర్, నా వైష్ణవి, క్షణం ఒక యుగమే, మిస్సమ్మ లాంటి వెబ్ సిరీస్ లలో నటించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఫుల్ సినిమా ఆఫర్ లతో బీజీగా ఉంది. ఇక ఫుల్ ఆఫర్స్ రావడంతో రెమ్యునరేషన్ కూడా పెంచిందంట.

వైష్ణవి చైతన్య ఇతర హీరోయిన్ లకు గట్టి పోటీ ఇస్తుంది. ఈమె తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ అందాల భామ తన నటన ప్రతిభను కనబరచింది. బేబీ సినిమాలో ఈమె ట్రయాంగిల్ లవ్ స్టోరీని నడుపుతుంది. ఈ సినిమాలో హీరోలుగా ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ నటించారు. ఈ మూవీ మంచి హిట్ అందుకుని.. బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల కలెక్షన్ ని వసూలు చేసింది. ఈ సినిమా మొత్తం వైష్ణవి చైతన్యనే కనిపిస్తుంది. ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం వార్తలలో నిలుస్తుంది. ఇక ఆ ఫోటోస్ ని చూసిన నెటిజన్స్ అబ్బబ్బా ఏం అందం ఏం అందం అని కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు అయితే మంచి ట్రీట్ ఇచ్చింది అంటూ పెడుతుంటారు.

ఈమె ఎప్పుడు త‌న స్టైలిష్‌, హాట్ అవుట్‌ఫిట్స్‌తో అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటూ ఉంటుంది. ప్రస్తుతం స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ జాక్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్య నటిస్తుంది. ఇందులో వైష్ణవి చైతన్య ద్విపాత్రాభినయం చేస్తుంది. ఈ సినిమాకు బొమ్మరిల్లు డైరెక్టర్ భాస్కర్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. జాక్ సినిమాకు బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మాతగా ఉన్నారు. సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 10న ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమాకు వైష్ణవి చైతన్య రూ. కోటి పారితోషికం ఆఫర్ చేశారట.

మరింత సమాచారం తెలుసుకోండి: