టాలీవుడ్ యంగ్ టైగర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం జపాన్లో దేవర సినిమా ప్రమోషన్లు చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు. గత ఏడాది చివర్లో వచ్చిన దేవర సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టింది. ట్రిపుల్ ఆర్‌ లాంటి భారీ పాన్ ఇండియా హిట్ సినిమా తర్వాత.. వచ్చిన దేవర అంచనాలకు మించి సక్సెస్ అయింది. వాస్తవానికి ఈ సినిమాకు యావ‌రేజ్ టాక్‌ వచ్చినా కూడా.. కేవలం ఎన్టీఆర్ క్రేజ్, ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో తో అదరగొట్టింది.


ఇక జపాన్లో దేవర సినిమాను ఎన్టీఆర్ ఏ రేంజ్‌లో ప్రమోట్ చేస్తున్నాడో సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం. ఎన్టీఆర్ తో పాటు దర్శకుడు కొరటాల శివ కూడా జపాన్ లో దేవర ప్రమోషన్లలో బిజీబిజీగా ఉన్నారు. అయితే ఈ క్రమంలో కొరటాల శివ ఓ ఎవర్‌ గ్రీన్ క్లాసిక్ రీమేక్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా సౌత్ ఇండియాలో కే.విశ్వనాధ్ అనే లెజెండ్రీ డైరెక్టర్ ఉండేవారు. ఆయన సాగర సంగమం సినిమాను తెర‌కెక్కించారు.


సినిమా ఇప్పటికీ.. ఎప్పటికీ.. ఎవర్‌గ్రీన్‌ క్లాసిక్ సినిమాగా నిలిచిపోయిందని.. ఆ సినిమాలో విశ్వనటుడు కమలహాసన్ నటించగా.. ఆ సినిమా అంటే ఈ జనరేషన్ డైరెక్టర్లకు ఎంతో ఇష్టం అంటూ కొరటాల తెలిపారు. సాగర సంగమం సినిమాని ఇప్పుడున్న డైరెక్టర్లలో ఎవరైనా రీమేక్ చేస్తే.. కేవలం ఎన్టీఆర్ మాత్రమే హీరోగా వారి చాయిస్ అని కొరటాల కామెంట్ చేశాడు. దీంతో సాగర సంగమం సినిమాను నిజంగానే రీమేక్ చేస్తే ఎన్టీఆర్ మాత్రమే ఈ సినిమాకు పూర్తిస్థాయిలో న్యాయం చేయగలడు అంటూ ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇక కొరటాల శివ చేసిన ఈ కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: