బాలీవుడ్ కండల వీరుడు స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తాజా మూవీ సికిందర్ .. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురగదాస్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన‌ ఈ సినిమాను రూ . 200 కోట్లతో నిర్మించారు .. భారీ అంచనాల మధ్య గత నేల 30 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్లాప్ టాక్‌ తెచ్చుకుంది .. పాత చింతకాయ పచ్చడి కథ‌ ఓల్డ్ స్టైల్ మేకింగ్ అని నేటిజన్స్ సికిందర్ ను ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు .. కలెక్షన్లు కూడా ఆశించిన స్థాయి లో అందుకోలేకపోయింది ..


ఇలా వరుస ప్లాఫ్ లతో ఇబ్బంది పడుతున్న సల్మాన్ ఖాన్ .  ఇప్పుడు ప్లాప్ సినిమాల తో కాలక్షేపం చేస్తున్న ఓ టాలీవుడ్ దర్శకుడు తో సినిమా చేయబోతున్నాడని టాక్ అటు బాలీవుడ్ , టాలీవుడ్ మీడియాలో గట్టిగా వినిపిస్తుంది .  గత ఏడాది మాస్ మహారాజా రవితేజ తో మిస్టర్ బచ్చన్ అనే సినిమాను తెర్కక్కించాడు హరీష్ శంకర్ .. బాలీవుడ్ మూవీ రైడ్‌ కు రీమేక్ గా వచ్చిన ఈ సినిమా దారుణ పరాజయాన్ని అందుకుంది .. ఈ సినిమా బడ్జెట్లో కనీసం 20% కూడా థియేటర్స్ నుంచి రాబెట్టుకోలేకపోయింది ..


ఇక ఇప్పుడు తన తర్వాత సినిమా బాలీవుడ్ లో చేసేందుకు ఎంతో ప్రతిక్షణాలు చేసి చివరికి బాలీవుడ్ హీరోను సెట్ చేశారని సినీ వర్గాల్లో చర్చ వినిపిస్తుంది .. అయితే ఈ సినిమా ను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ  మేకర్స్ వారు నిర్మిస్తారని కూడా అంటున్నారు .. అలాగే రీసెంట్ గానే అమరాన్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన తమిళ దర్శకుడు రాజ్‌కుమార్ పెరియస్వామితో కూడా సల్మాన్ ఖాన్ కథ చర్చలు నడుపుతున్నాడని టాక్ వినిపిస్తుంది.. ఇక మరి ఈ ఇద్దరిలో కండ‌ల‌ వీరుడు ఎవరితో ముందుగా సినిమా చేస్తాడు అనేది వేచి చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: