
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా భూమిక హీరోయిన్గా ఎస్ జె సూర్య దర్శకత్వంలో రూపొందిన ఖుషి మూవీ ని కొంత కాలం క్రితం రీ రిలీజ్ చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. రీ రిలీజ్ లో భాగంగా ఈ మూవీ కి ఐదు కోట్లకు మించిన కలెక్షన్స్ వచ్చాయి. ఇక జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన సింహాద్రి మూవీ రీ రిలీజ్ లో భాగంగా ఐదు కోట్ల మించిన కలెక్షన్లను రాబట్టింది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన బిజినెస్ మాన్ మూవీ రీ రిలీజ్ లో భాగంగా ఐదు కోట్లకు మించిన కలెక్షన్లను రాబట్టింది. మహేష్ బాబు హీరో గా సోనాలి బింద్రే హీరోయిన్గా కృష్ణ వంశీ దర్శకత్వంలో రూపొందిన మురారి సినిమా కూడా రీ రిలీజ్ లో భాగంగా ఐదు కోట్లకి మించిన కలెక్షన్లను రాబట్టింది.