మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరో గా ఇప్పుడు చేస్తున్న భారీ సినిమా ల్లో దర్శకుడు ప్రశాంత్ నీల తో చేస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా కూడఒకటి .. ఇక దీని పై గట్టి అంచనాలు కూడా ఉన్నాయి .. అయితే ఇప్పుడు ఈ సినిమా కి సంబంధించి న ఓ అప్డేట్ ని మేకర్స్‌ సడన్ గా అనౌన్స్‌ చేయడం అనేది అభిమానం లో ఆసక్తి గా మారింది .. అయితే ఇప్పుడు అందరి కళ్ళు ఈ అప్డేట్ ఏంటి అనే దాని మీదే పడ్డాయి .. ఇక ప్రస్తుతాని కైతే మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ ని లాక్ చేసినట్టు గా తెలుస్తుంది ..


గతం లో జనవరి 9 న మేకర్స్ ఈ సినిమా ను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే .. కానీ ఇప్పుడు కొత్త డేట్ ని మేకర్స్ నేడు అనౌన్స్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది .. ఇక మరి ఆ అప్డేట్ కోసమే లేక మరేమన్నా అనేది ఈ మధ్యాహ్నం తేలిపోనుంది .  ఇప్పటి కే ఎన్టీఆర్ దేవర విజయం తో ఫుల్ ఫార్మ్ లో ఉన్నాడు . ఇక ఈ సినిమా కోల్‌కత్తా బ్యాక్‌డ్రాప్‌లో డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ నేపథ్యంలో సాగనుంది. కేజీయఫ్‌, సలార్‌ తరహాలో సాగనుంది. ఇక ఈ మూవీకి డ్రాగన్‌ అనే టైటిల్‌ ప్రచారంలో ఉంది. ఇక ఫస్ట్‌ షెడ్యూల్‌ని ఎన్టీఆర్‌ లేకుండానే మొదలు పెట్టాడు ప్రశాంత్‌. సెకండ్‌ షెడ్యూల్‌ని వికారాబాద్‌ అడవుల్లో ప్లాన్‌ చేశాడట.


మార్చిలో జరిగిన ఈ షెడ్యూల్‌ ఎన్టీఆర్‌ పాల్గొన్నట్టు సమాచారం. ఈ సినిమాలో సప్త సాగరాలు ఫేం, కన్నడ నటి రుక్మిణి వసంత్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామా రూపొందనున్న ఈ సినిమాకు రవి బస్రూర్‌ సంగీతం అందించనున్నారు. ఇదే క్రమంలో బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 చేస్తున్నాడు .. అలాగే ప్రశాంత్ నీల్‌ కూడా  ఎప్టీఆర్ తో చేయబోయే సినిమా షూటింగ్ కూడా రీసెంట్ గానే మొద‌లు పెట్టారు .. ఇలా వరుస జోష్లో ఉన్న ఎన్టీఆర్ .. ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేయడాని కి సిద్ధమవుతున్నాడు .

మరింత సమాచారం తెలుసుకోండి: