టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నగడ్డ హీరో గా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం లో తెర‌కెక్కిన‌ చిత్రం జాక్ .  శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ పై బివిఎస్ ప్రసాద్సినిమా ను నిర్మించారు .. టిల్లు స్క్వేర్ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత సిద్దు జొన్నలగడ్డ నటించిన సినిమా కావటం తో జాక్‌ పై భారీ అంచనాలు కూడా ఉన్నాయి .. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ కూడా వచ్చింది .. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా ఎంతో గ్రాండ్గా నిర్వహించారు ..


అయితే  ఈ సందర్భంగా హీరో సిద్దు మాట్లాడుతూ .  టిల్లు స్క్వేర్‌ తర్వాత ఎలాంటి సినిమా చేయాలి, ఎలాంటి సినిమా చేస్తే కరెక్ట్ కానీ మళ్ళీ అదే సినిమా చేశాడు రా అనే మాట రాకుండా ఉండాలంటే ఏం చేయాలని అనే గందరగోళం లో ఉన్న సమయంలో నిర్మాత ప్రసాద్ గారు నా దగ్గరికి భాస్కర్ ని తీసుకువచ్చి ఓ కథ వినిపించారు .. అయితే అలా కథ విన్న వెంటనే టిల్లు స్క్వేర్ తర్వాత నేను చేయాల్సిన సినిమా ఇదే అని తన మనసుకు అనిపించింది .. అలా వెంటనే సినిమాలు ఓకే చేసేసాను .  రామ్ చరణ్ తో చేసిన ఆరెంజ్ సినిమా నుంచి భాస్కర్ తో నాకు అనుబంధం ఉంది .. అప్పట్లో ఆయన నన్ను తిట్టేవాడు కూడా ..


 కానీ ఆయన  ఎప్పుడూ సినిమా గురించి ఆలోచిస్తారు. టిల్లు సినిమాలో పంచులు వినోదం ఉండేలా నాకు స్పేస్ ఇచ్చారు భాస్కర్ .. అలాగే బేబీ సినిమా చూసినప్పుడే అంతా ఫిక్స్ అయ్యాం జాక్ లో హీరోయిన్ వైష్ణవి ని తీసుకోవాలని .. అలాగే ఆమె లో ఎంతో ప్రతిభ‌ ఉంది ఆమె ఎక్కడికో వెళుతుంది .. ఏప్రిల్ 10న ఈ సినిమా విడుదల కాబోతుంది .. ఆరెంజ్ సినిమాల పదేళ్ల తర్వాత కాకుండా ఇప్పుడు సినిమా చూసి హిట్ చేయండి .. జాక్ సినిమా తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది అంటూ సిద్దు చెప్పుకొచ్చాడు .

మరింత సమాచారం తెలుసుకోండి: