టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా 'విశ్వంభర' సినిమా ఎప్పుడు ప్రకటించారో అప్పటినుండి ఈ సినిమాపైన భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇకపోతే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఆల్రెడీ వచ్చేసింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ మీద 'బింబిసార' ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్న సంగతి విదితమే. రీసెంట్‌గా ఈ ఫస్ట్ సింగిల్ షూటింగ్ పూర్తయిందని కూడా తెలుస్తోంది. ఈ పాటలోనే సాయి ధరమ్ తేజ్, నిహారిక కూడా కనిపించే అవకాశాలు వున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. హనుమాన్ జయంతి సందర్భంగా ఈ పాటను ఏప్రిల్ 12న రిలీజ్ చేయబోతోన్నట్టుగా తాజాగా ప్రకటించారు. రామ రామా అంటూ సాగే ఈ ఫస్ట్ సింగిల్‌ను ఏప్రిల్ 12న రిలీజ్ చేయబోతోన్నట్టుగా ప్రకటిస్తూ వదిలిన పోస్టర్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.

ఇక అసలు విషయంలోకి వెళితే... ఈ సినిమా ఈ సంవత్సరం జనవరి నెలలోనే విడుదల కావాల్సి ఉండగా వాయిదా వేయడం జరిగింది. దానికి గల కారణం ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విషయం ఏమిటంటే... ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేయాల్సి ఉండగా... సంగీత దర్శకుడు కీరవాణి ఇచ్చిన ట్యూన్ విషయంలో చిరు కాస్త అసంతృప్తి చెందారట. ఆ కారణంగానే సినిమా కాస్త ఆలస్యమవుతున్నట్టు టాలీవుడ్లో గుసగుసలు వినబడుతున్నాయి. దాంతో దిగ్గజ సంగీత దర్శకుడు కీరవాణి మరో ట్యూన్ రెడీ చేసే పనిలో పడ్డట్టు తెలుస్తోంది. ఈ స్పెషల్ సాంగ్ లో మెగాస్టార్ మాస్ కి కావలసిన స్పెషల్ స్టెప్స్ వేయబోతున్నట్టు సమాచారం.

కాగా విశ్వంభర సినిమా నుంచి గత కొన్ని నెలల నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. అయితే దానికి కారణం లేకపోలేదు... విశ్వంభర గ్లింప్స్ ద్వారా వచ్చిన నెగెటివిటీతో టీం అంతా మళ్లీ ప్యాచ్ వర్క్‌లో బిజీగా పడ్డట్టు సమాచారం. మరీ ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ పనుల్ని మళ్లీ కొత్తగా స్టార్ట్ చేశారని తెలుస్తోంది. గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ పనుల మీద మళ్లీ వశిష్ట కూర్చున్నాడని, అందుకే చాలా ఆలస్యం అవుతూ వస్తోందని కొంతమంది అంటున్నారు. ఏది ఏమైనా ఈఏడాదిలోనే ఈ సినిమా రావాలని మెగాభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు... విశ్వంభర సినిమాను జూన్‌లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. ఇంద్ర రిలీజ్ అయిన డేట్‌ను సెంటిమెంట్‌గా పెట్టుకుని విశ్వంభరను విడుదల చేయాలని అనుకుంటున్నారని వినికిడి.

మరింత సమాచారం తెలుసుకోండి: