వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి తెలుగు జనాలకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటూ వర్మ తన ఉనికిని ఎప్పటికప్పుడు చాటుకుంటూ ఉంటారు. పలు పోస్టులతో వివాదాలు సృష్టిస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇక ఆయన సినిమాల విషయానికొస్తే.. కొన్నాళ్ల క్రితం వరకు మంచి మంచి సినిమాలు తీసి ప్రేక్షకుల్ని అలరించిన వర్మ గత కొన్నాళ్ళనుండి చావుకబారు సినిమాలు తీస్తూ తన బ్రాండుని తానే కోల్పోతున్న పరిస్థితి వున్నది. అయితే చాలా ఏళ్ల తర్వాత వర్మ ‘శారీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఓ ఇన్‌స్టాగ్రామ్ అమ్మాయిని ఇందులో హీరోయిన్‌గా పెట్టిన సంగతి విదితమే. ఏప్రిల్ 4న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేర అలరిస్తోందో చెప్పాల్సిన పనిలేదు.

సినిమా చూసిన సగటు ప్రేక్షకుడు వర్మ పస అయిపోయింది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, ఆర్జీవీ తన తదుపరి చిత్రాన్ని ప్రకటిస్తూ ట్విట్టర్‌లో షాకింగ్ పోస్ట్ చేయడం జరిగింది. ‘‘సత్య, కౌన్ స్కూల్ తర్వాత నేను ఈ సినిమా ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. నేను, బాజ్‌పేయి మనోజ్ మేమిద్దరం చేయని హార్రర్ కామెడీ జానర్ కోసం మరోసారి జత కట్టడం ఇంకా ఆనందంగా వుంది. నేను హారర్, గ్యాంగ్‌స్టర్, రొమాంటిక్, పొలిటికల్ డ్రామాలు, అడ్వెంచర్ కేపర్‌లు, థ్రిల్లర్‌లు మొదలైనవి చేసాను. కానీ ఎప్పుడూ హార్రర్ కామెడీ చేయలేదు. ఇపుడు ట్రై చేస్తున్నాను." అని చెప్పుకొచ్చారు.

కాగా... ఈ చిత్రానికి ‘పోలీస్ స్టేషన్ మెయిన్ భూత్’ ట్యాగ్ లైన్: You Can't Kill The Deadతో అని పెట్టడం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ సినిమా మెయిన్ థీమ్ గురించి వర్మ మాట్లాడుతూ... మనం భయపడినప్పుడు పోలీసుల దగ్గరకు పరిగెత్తుతాము. కానీ పోలీసులు భయపడినప్పుడు ఎక్కడికి పరిగెత్తుతారు? అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిస్తాం అని చెప్పుకొచ్చారు. ఓ ఘోరమైన ఎన్‌కౌంటర్ హత్య తర్వాత, పోలీసు స్టేషన్ హాంటెడ్ స్టేషన్‌గా మారుతుంది. గ్యాంగ్‌స్టర్ల దెయ్యాల నుండి తప్పించుకోవడానికి పోలీసులందరూ భయంతో పరుగులు తీస్తూ వుంటారు. అత్యాధునిక VFX, చిల్లింగ్ హర్రర్ ఎఫెక్ట్‌లతో, పోలీస్ స్టేషన్ మెయిన్ భూత్ మిమ్మల్ని భయ భ్రాంతులకు గురిచేసే వినోదభరితమైన చిత్రం అవుతుంది! అని చెప్పుకొచ్చారు వర్మ.

మరింత సమాచారం తెలుసుకోండి: