
స్టార్ హీరో అజిత్, త్రిష నటించిన 'పట్టుదల' సినిమా సందడి చేయనుంది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా నేడు ఓటీటీలో విడుదల అయ్యింది. ఈ సినిమా ఒక యాక్షన్ కామిడీ మూవీ. ఈ సినిమాలో అజిత్ లుక్స్ మామూలుగా లేవు.. దీంతో ప్రేక్షకులకు ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అలాగే బాలీవుడ్ నటుడు సన్నీ దేవోల్ హీరోగా నటించిన జాట్ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సినిమాకు టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. ఈ సినిమా కూడా నేడు రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో హీరోయిన్ లుగా సయామీ ఖేర్, రెజీనా నటించారు.
డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో జాక్ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సినిమాలో హీరోగా స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ నటిస్తున్నాడు. ఈ సినిమాలో సిద్దుకి జోడీగా తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్య నటిస్తుంది. ఇందులో వైష్ణవి చైతన్య ద్విపాత్రాభినయం చేస్తుంది. జాక్ కొంచెం క్రాక్ సినిమా సమ్మర్ స్పెషల్ గా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. జాక్ సినిమాకు బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా ఉన్నారు. ఈ సినిమా ఒక్క మంచి కామిడీ టైమింగ్ తో చక్కగా వినోదాన్ని పంచుతుందని సమాచారం.