మాస్ మహారాజ రవితేజ సరైన విజయం చూసి చాలా కాలం అయిపోయింది .. కరోనా తర్వాత వచ్చిన క్రాక్ సినిమానే రవితేజకు చివరి బ్లాక్ బస్టర్ .. ఇక ఈ సినిమా తర్వాత వచ్చిన సినిమాలన్నీ భారీగా నిరాశపరిచాయి .. అయితే క్రాక్ సినిమా తీసిన  గోపీచంద్ మలినేనిచ గత ఏడాది మాస్ మహారాజా తో మరో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేశాడు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం లో ఈ సినిమా రావాల్సి ఉంది  .. కానీ సినిమా ప్రకటన తర్వాత ఈ మూవీ అనూహ్యంగా క్యాన్సిల్ అయింది .  అధిక బడ్జెట్ కారణాలతో ఈ సినిమాకు బ్రేక్ పడిందని వార్తలు వచ్చాయి .. అయితే ఇప్పుడు ఈ కథ ఎక్కడ వేస్ట్ అయిపోలేదు ఇదే స్క్రిప్ట్ తో మైత్రి నిర్మాణంలో బాలీవుడ్ లో సన్నీ డియోల్ హీరోగా జాట్ సినిమా చేశాడు గోపీచంద్ .


సౌత్ మాస్ మసాలా స్టోరీకి కొంచెం బాలీవుడ్ టచ్ కూడా ఇచ్చాడు .  ఇక నిన్న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది .. గాదర్ 2 తర్వాత సన్నీ నుంచి వస్తున్న సినిమా కావటంతో బాలీవుడ్ లో ఈ సినిమా పై భారీగా అంచనాలు ఉన్నాయి ట్రైలర్ సహాయ ప్రోమోల‌న్నీ అన్నీ కూడా ప్రేక్షకులు ఎంతగానో ఆకర్షించాయి .. గురువారం భారీ అంచ‌నాల మధ్య రిలీజ్ అయిన జాట్‌ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది .  గత కొన్ని సంవత్సరాలగా సౌత్ మసాలా సినిమాలకు బాగా అలవాటు పడ్డ హిందీ ప్రేక్షకులు  స‌న్నీ డియోల్‌ను సౌత్ టచ్ ఉన్న జాట్‌ సినిమాను చూడడానికి బాగా ఆకర్షితులు అవుతున్నారు .. అలాగే ఈ సినిమాలో ఉన్న మాస్ మసాలా సన్నివేశాలకు థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి ..


అర్బన్ , రూరల్ ఇలా అన్ని ఏరియాలోను జాట్ కు టాక్  థియేటర్ రెస్పాన్స్ కూడా బాగుంది .. రివ్యూలు కూడా అన్ని పాజిటివ్ గానే ఉన్నాయి .. ఈ సినిమా ఓపెనింగ్స్ కూడా బాగానే వచ్చాయి .. ఇక ఈ సినిమా చూసిన తెలుగు ప్రేక్షకులు చాలామంది చెబుతున్న అభిప్రాయం ఏమిటంటే .. రవితేజ ఓ పెద్ద హిట్ ను అందుకుని అవకాశం మిస్ అయ్యాడని మాస్ మహారాజా కు అయితే ఈ సినిమా ఇంకా పర్ఫెక్ట్ గా ఉండేదని తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను బాగా ఆదరించే వారిని క్రాక్‌ను మించి పెద్ద హీట్ అయ్యేది అని కూడా అంటున్నారు .. బడ్జెట్ సహా ఎలాంటి సమస్య ఉన్న తెలుగులో ఈ సినిమా తీసి ఉంటే బాగుండేదని కూడా వారు కామెంట్లో చేస్తున్నారు. ఇక  మరికొందరు రవితేజ ఇలాంటి మాస్ మసాలాలు ఇప్పటికే చాలా చేశాడని, మనవాళ్ళకి కూడా అంతగా నచ్చేది కాదు, రవితేజ చేయకపోవడమే మంచింది అయ్యిందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: