టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు కలిగిన సీనియర్ స్టార్ హీరోలలో చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున , వెంకటేష్ ముందు వరుసలో ఉంటారు. వీరు ముగ్గురు కూడా ఎన్నో సంవత్సరాలుగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలుగా కెరియర్ను కొనసాగిస్తూ వస్తున్నారు. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న ఓ బ్యూటీ చిరంజీవి , బాలకృష్ణ నటించిన సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఇక ఆ బ్యూటీ నాగార్జున , వెంకటేష్ పక్కన ఇప్పటి వరకు ఒక్క సినిమాలో కూడా నటించలేదు. కానీ ఆమె నాగార్జునతో రెండు సార్లు నటించాల్సిన అవకాశాన్ని అందుకున్న ఆఖరి నిమిషంలో క్యాన్సల్ అయింది. మరి నాగార్జున తో సినిమా అవకాశాన్ని రెండు సార్లు మిస్ చేసుకున్న ఆ బ్యూటీ ఎవరో తెలుసా ..? ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదు మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి కాజల్ అగర్వాల్.

కాజల్ అగర్వాల్ , చిరంజీవి హీరోగా రూపొందిన ఖైదీ నెంబర్ 150 సినిమాలో హీరోయిన్గా నటించింది. ఆ తర్వాత చిరంజీవి హీరోగా రూపొందిన ఆచార్య సినిమాలో కూడా హీరోయిన్గా నటించింది. కానీ సినిమాలో ఈమె పాత్రను మాత్రం ఈ సినిమా నుండి తొలగించారు. ఇక బాలకృష్ణ హీరోగా రూపొందిన భగవంత్ కేసరి సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించింది. ఇది ఇలా ఉంటే నాగార్జున హీరోగా రూపొందిన రగడ సినిమాలో ప్రియమణి స్థానంలో కాజల్ ను తీసుకోవాలి అని మొదట ఈ మూవీ బృందం వారు అనుకున్నారట. కానీ చివరి నిమిషంలో అది కుదరలేదట. అలాగే నాగార్జున హీరోగా రూపొందిన ది ఘోస్ట్ మూవీ లో హీరోయిన్గా ఈ బ్యూటీని మొదట ఈ సినిమాలో హీరోయిన్గా అనుకున్నారట. కానీ అది చివరి నిమిషంలో కుదరలేదట. అలా నాగార్జున పక్కన రెండు సార్లు కాజల్ కి ఛాన్స్ వచ్చిన అవి మిస్ అయినట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: