
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ఈ వేదికపై నేను, అన్న ఉన్నప్పుడు మా నాన్న ఎన్నో సార్లు మా గురించి మాట్లాడారు. ఇప్పుడు విజయశాంతి గారు మాట్లాడుతుంటే ఆయన లేని లోటు తీరినట్లు అనిపించింది. చాలా మంది హీరోలు ఎంతో సాధించారు.. కానీ వాళ్లకు దీటుగా సినిమా ఇండస్ట్రీలో నిలిచిన మహిళ విజయశాంతి గారు మాత్రమే. ఆమె చేసిన సినిమాలు మరో హీరోయిన్ చేయలేదు. కర్తవ్యం సినిమాలో పోలీస్ ఆఫీసర్ కి కొడుకు పుడితే ఎలా ఉంటుంది అనే ఐడియా తోనే ఈ మూవీ ఆలోచన వచ్చిందేమో.
ఈ సినిమా చూశాను. విజయశాంతి, పృథ్వీ, సోహెల్ ఖాన్ లేకపోతే ఈ సినిమా లేదు అనిపించింది. ముఖ్యంగా దర్శకుడు ప్రదీప్ చిలుకూరి , నిర్మాతలు ఈ కథను ఎంతో నమ్మారు. చివరి 20 నిమిషాలకు థియేటర్లలో ప్రేక్షకులకు కచ్చితంగా కన్నీలాగవు. అంత అద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కించారు..ఈ మూవీ కళ్యాణ్ అన్న కెరియర్ లోనే ఒక స్పెషల్ గా నిలిచిపోతుంది అంటూ తెలిపారు ఎన్టీఆర్.