ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ హరిహర వీరమల్లు .. ఇక ఈ సినిమా మే 9 న ఎంతో గ్రాండ్ గా ప్రేక్షకులు ముందుకు రాబోతుంది .. అయితే రీసెంట్ గానే పవన్ తన కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్  తన స్కూల్లో జరిగిన అగ్నీ ప్రమాదంలో గాయపడటంతో సింగపూర్ కు వెళ్లారు .. అలాగే చికిత్స సమయంలో పవన్ కళ్యాణ్ తన కొడుకు పక్కనే ఉన్నారు .  అదృష్టవశాత్తు మార్క్ శంకర్ కు ఎలాంటి ప్రమాదం లేకుండానే త్వరగానే కోలుకుంటున్నాడు .  


అలాగే తన కొడుకుతో కలిసి నిన్న పవన్ హైదరాబాద్ కు తిరిగివచ్చారు . ఇక దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆశక్తిగా ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు సినిమా పై పడింది పవన్ కి ఇంకా మూడు నుంచి ఐదు రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది .. కాబట్టి పవన్ త్వరలోనే ఈ సినిమా షూటింగ్ సెట్స్ లో అడుగుపెట్టి తన భాగాన్ని పూర్తి చేస్తారని కూడా తెలుస్తుంది .  ఇప్పటికే విడుదల తేదీ కూడా మే 9 కాబట్టి ప్రమోషనల్ కంటెంట్‌ను విడుదల చేయాలని చిత్ర బంధాన్ని ఫాన్స్ ఎంతగానో కోరుతున్నారు .  కాగా దర్శకుడు జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది.  


అలాగే ఈ సినిమాలో నిధి అగర్వాల్తో పాటు బాబీ డియోల్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు మరియు నోరా ఫతేహి కీలక పాత్రలో నటిస్తున్నారు .. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఏ దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ సినిమాకి ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా . మరో అగ్ర దర్శ‌కుడు క్రిష్ జాగర్లమూడి కూడా ఈ సినిమాలోని పలు కీలక సన్నివేశాలకు దర్శకత్వం వహించారు . ఇక మరి పాన్ ఇండియా స్థాయిలో పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి వస్తున్న ఈ తొలి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: