టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతి వస్తున్నాం మూవీ హ్యాట్రిక్ కొట్టేసింది. ఈ సినిమాలో హీరోయిన్లు గా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ నటించారు. అయితే తెలుగు అమ్మాయి ఐశ్వర్య రాజేష్ నటన గురించి పరిచయం అనవసరం. ఈమె చాలా సినిమాలలో నటించినప్పటికి.. అంతగా గుర్తింపు రాలేదు. కానీ సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత ఈమె మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో తన ఫోటోస్ ని షేర్ చేసింది. ఆ ఫోటోస్ లో ఈమె విహార యాత్రకు వెళ్లినట్లు తెలిపింది. ఇక ప్రస్తుతం ఆ ఫోటోస్ తెగ వైరల్ అవుతున్నాయి.  

ఈ సినిమాకు డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించారు. బ్లాక్‌బస్టర్ లక్ష్మి కోసం వెంకటేష్‌తో కలిసి పని చేసిన రమణ గోగుల ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫస్ట్ సింగిల్‌కి తన వాయిస్ ని అందించారు. 
సంక్రాంతి పండుగ సందర్భంగా 'సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా గ్రాండ్ రిలీజ్‌ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా సంక్రాంతి హిట్ అయ్యి.. రూ. 300 కోట్లకు పైగా వసూళ్లను దాటింది. ఇక ఇటీవలే ఈ సినిమా జీ5 ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో రిలీజ్ అయ్యింది.

సినిమా రిలీజ్ అయిన కేవలం 12 గంటల్లోనే దాదాపు 13 లక్షల మంది చూశారు. ఇక ఈ సినిమా మెయిన్ టార్గెట్ ఫ్యామిలీ ఆడియన్స్ అవ్వడంతో సినిమా దూసుకుపోతుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ఈ మూవీని తెగ చూసేస్తున్నారు. ఈ మూవీకి బ్లాక్‌ బస్టర్‌ హిట్ కొట్టడంతో.. అటు థియేటర్ లో ఇటు ఓటీటీలో రికార్డులు సృష్టిస్తుంది. ఇక సంక్రాంతికి వస్తున్న సినిమా బుల్లితెరపైన కూడా టెలికాస్ట్ అయ్యి అత్యధిక టీఆర్పీ రేటింగ్ ని సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: