ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్య ఆన్నాలెజీనోవా  గురించి పరిచయం చేయనవసరం లేదు. తన కుమారుడు మార్క్ శంకర్  ఆరోగ్యం కుదుటపడిందని నిన్నటి రోజున హైదరాబాద్ కి న  చేరుకున్నారు అన్నా లేజీనోవా. ఆ వెంటనే తిరుపతి పయనమై అక్కడికి చేరుకున్నారు. తన కుమారుడు అగ్ని ప్రమాదం నుంచి ఆరోగ్యంగా బయటపడడంతో నిన్నటి రోజున తన మొక్కును చెల్లించినట్లు తెలుస్తోంది. అన్నా లేజీనోవా  తిరుపతికి చేరుకొని ముందుగా అక్కడ డిక్లరేషన్ ఫారం మీద సంతకం పెట్టి ఆ తర్వాత వరాహ స్వామిని దర్శించుకుని అటు నుంచి భక్తురాలిగా కళ్యాణకట్టకు చేరుకున్నారు.


ఇక అక్కడ తలనిలాలు సమర్పించారు. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక ఈరోజు ఉదయం సుప్రభాత సమయంలో కూడా ఈమె శ్రీవారిని దర్శించుకుంటున్నట్లు తెలుస్తోంది.అందుకు సంబంధించిన అధికారులు కూడా పలు రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అనంతరం అన్నదానం కోసం విరాళం కూడా ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అక్కడే అన్నదానం స్వీకరించి మరి ఆమెతో పాటు పిల్లలు కూడా తిరుపతికి చేరుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.


సింగపూర్లో కిచెన్ స్కూల్లో అగ్నిప్రమాదం జరగడంతో దీంతో పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ కూడా ఈ అగ్ని ప్రమాదం లో చిక్కుకోవడం జరిగింది. దీంతో హుటాహుటిగా మెగా కుటుంబ సభ్యులు కూడా సింగపూర్ కి బయలుదేరి మరి అక్కడ మార్క్ శంకర్ ఆరోగ్యం గురించి అన్ని విధాల వైద్యులను అడిగి మరి తెలుసుకున్నారట. అనంతరం అక్కడ చిన్నపిల్లలను సైతం కాపాడినటువంటి టీముని కూడా సత్కరించడం జరిగింది పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కుమారుడు మార్పు కి మాత్రం కాళ్లు చేతులకు కూడా గాయాలు అయ్యాయి అయితే ప్రస్తుతం అయితే కోలుకొని ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి తన కొడుకు కోసం తలనీలాలు  ఇచ్చింది అన్నాలేజినోవా.

మరింత సమాచారం తెలుసుకోండి: