ఇక మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా క్రేజీ మల్టీ స్టారర్ వార్ 2 .. ఇక ఈ సినిమా ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 14న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది .  ఇప్పటికే ఈ సినిమాపై పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాలు అయితే ఉన్నాయి .. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా పై లేటెస్ట్ అప్డేట్ ఒకటి వైరల్ గా మారింది .. ఎన్టీఆర్ హృతిక్‌ ఇద్దరు నటించిన ఈ సినిమాకు సంబంధించిన తొలి మోషన్ పోస్టర్ ను 2025 మే రెండో వారంలో విడుదల చేయబోతున్నారట ..


అలాగే ఈ వార్తకు సంబంధించిన అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు .  కాగా ఈ మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా క్రేజీ మల్టీ స్టార‌ర్స్ లో వార్‌2 ఇండియాలోనే మొదటి ప్లేస్ లో ఉంది .. అలాగే ఎన్టీఆర్ , హృతిక్ రోషన్ కాంబో అనగానే ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు పెరిగిపోయాయి .. అలాగే ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రపై అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం కూడా తెలిసింది .. ఇక నిర్మాత ఆదిత్య చోప్రా ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు .. అలాగే కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది ..


ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది .. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చిత్ర యూనిట్ బిజీగా ఉంది .. అలాగే ఈ సినిమాకు సంబంధించిన ఓ స్పెషల్ సాంగ్ షూటింగ్ పూర్తి అయితే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తయినట్టే .. త్వరలోనే ఆ సాంగ్ కు సంబంధించిన షూటింగ్ కూడా చేయబోతున్నారు .  అలాగే ఆ సాంగ్లో ఎన్టీఆర్ , హృతిక్ రోషన్ ఇద్దరూ కలిసి నటించబోతున్నారు .. ఇక మరి ఎన్టీఆర్ బాలీవుడ్ లో నటిస్తున్న తొలి క్రేజీ మూవీ కావటంతో ఈ సినిమా పై సౌత్, నార్త్‌ ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు .. ఎన్టీఆర్ బాలీవుడ్లో ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తారో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: