ఈ మధ్య కాలంలో ఇండియా వ్యాప్తంగా అనేక సినిమాలు రీ రిలీజ్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే రీ రిలీజ్ లో భాగంగా అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 6 మూవీస్ ఏవో తెలుసుకుందాం.

గిల్లి : తమిళ నటుడు తలపతి విజయ్ హీరో గా త్రిష హీరోయిన్ గా రూపొందిన ఈ మూవీ కి రీ రిలీజ్ లో భాగంగా 32.50 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

మురారి : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా సోనాలి బింద్రే హీరోయిన్ గా కృష్ణ వంశీ దర్శకత్వం లో రూపొందిన ఈ మూవీ కి రీ రిలీజ్ లో భాగంగా 8.90 కోట్ల కలెక్షన్ లు వచ్చాయి.

గబ్బర్ సింగ్ :  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా శృతి హాసన్ హీరోయిన్ గా హరీష్ శంకర్ దర్శకత్వం లో రూపొందిన ఈ మూవీ కి రీ రిలీజ్ లో భాగంగా 8.01 కోట్ల కలెక్షన్ లు వచ్చాయి.

ఖుషి : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా భూమిక హీరోయిన్ గా ఎస్ జె సూర్య దర్శకత్వం లో రూపొందిన ఈ సినిమాకు రీ రిలీజ్ లో భాగంగా 7.46 కోట్ల కనెక్షన్ లు వచ్చాయి.

ఆర్య 2 : అల్లు అర్జున్ హీరో గా రూపొందిన ఈ సినిమా లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా ... సుకుమార్మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కి రీ రిలీజ్ లో భాగంగా 6.75 కోట్ల కలెక్షన్ లు వచ్చాయి.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు : విక్టరీ వెంకటేష్ , సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోలుగా రూపొందిన ఈ సినిమాలో వెంకటేష్ కి జోడి గా అంజలి నటించగా ... మహేష్ బాబు కు జోడి గా సమంత నటించింది. శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కి రీ రిలీజ్ లో భాగంగా 6.60 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: