మలయాళ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మోహన్ లాల్ తాజాగా నటుడు మరియు దర్శకుడు అయినటువంటి పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో రూపొందిన L2 ఎంపురన్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా మార్చి 27 వ తేదీన భారీ ఎత్తున విడుదల చేశారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన 19 రోజుల బాక్సా ఫీస్ రన్ ఇప్పటివరకు కంప్లీట్ అయింది. ఈ 19 రోజుల్లో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో మినహాయిస్తే అన్ని ప్రాంతాల్లో మంచి కలెక్షన్స్ వచ్చాయి. 19 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి ... తెలుగు రాష్ట్రాల్లో ఏ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయి అనే వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం.

19 రోజుల్లో ఈ సినిమాకు కేరళ ఏరియాలో 86.25 కోట్ల కలెక్షన్లు దక్కగా , తెలుగు రాష్ట్రాల్లో 4.40 కోట్లు , తమిళనాడులో 9.85 కోట్లు , కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 22.75 కోట్లు , ఓవర్సీస్ లో 143.75 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు 19 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 125.65 కోట్ల షేర్ ... 267 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ 102 కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది.  19 రోజుల్లో ఈ సినిమాకు 23.65 కోట్ల రేంజ్ లో లాభాలు వచ్చాయి. ఇకపోతే ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో మినహాయిస్తే దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా మంచి కలెక్షన్లు రాబట్టింది. ఇకపోతే ఈ మూవీ తో మోహన్ లాల్ కు అదిరిపోయే రేంజ్ విజయం దక్కింది. అలాగే దర్శకుడిగా ఈ సినిమా ద్వారా పృథ్వీరాజ్ సుకుమారన్ కి కూడా మంచి క్రేజ్ వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: