తెలుగు టాప్ నిర్మాణ సంస్థ movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ మరోసారి తమ సత్తా చూపించింది .. గతంలో చిరంజీవి వాల్తేరు వీరయ్య , బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమాలను కేవలం ఒక్క వారం గ్యాప్ లోనే రిలీజ్ చేసి విజయం అందుకున్న మైత్రి .. ఈసారి మరింత భారీ రిస్కు తీసుకుని హాట్ టాపిక్ గా నిలిచింది .. ఏప్రిల్ 10న ఒకేరోజు రెండు పెద్ద సినిమాలను థియేటర్లో రిలీజ్ చేసింది .. వాటిలో ఒకటి కోలీవుడ్ స్టార్ అజిత్ నటించిన  ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ .. బాలీవుడ్ మాస్ హీరో సన్నీ డియోల్ నటించిన జాట్ ..


ఇలా ఒకేరోజు రెండు భిన్న భాష సినిమాలను రిలీజ్ చేయడమంటే మామూలు విషయం కాదు .. కానీ మైత్రి మూవీ సంస్థ ఈ ప్లాన్ తో ట్రేడ్ వర్గాలను ఎంతగానో ఆశ్చర్యపరిచింది .. మరియు ముఖ్యంగా ఈ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లు అందుకుంటున్నాయి .. గుడ్ బాడ్ అగ్లీ ఇప్పటికే 152 కోట్లకు పైగా గ్రాస్ ను రాబట్టినట్టు తెలుస్తుంది .. అలాగే ఇది అజిత్ కెరియర్ లోనే పెద్ద హిట్గా నిలిచి అవకాశం ఉంది . బాలీవుడ్ లో సన్నీ డియోల్ నటించిన జాట్ సినిమా విషయానికి వస్తే టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని  తెర్కక్కించిన ఈ మాస్ యాక్షన్ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి స్థాయిలోనే రాబడుతుంది .  


ఇక ఇప్పటివరకు ఈ సినిమా 70 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకుంది .. అలాగే నార్త్ లో ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది ,, మాస్ ఆడియన్స్ లో మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది .. ఒకే రోజు ఇలా రెండు సినిమాలు విడుదల చేయటం వల్ల ప్రమోషన్స్ థియేటర్ షేరింగ్ డిస్టిబ్యూషన్ ఇలా కొన్ని కొనల్లో తప్పనిసరిగా కష్టతరమైన విషయాలు .. కానీ movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వాటిని అత్యంత పకడ్బందీగా సమర్థవంతంగా నిర్వహించింది .. ప్రొఫెషనల్ టీం ప్లానింగ్ తో సక్సెస్ను తమ వైపు తిప్పుకుంటున్నారు .  ఇలా మొత్తానికి మైత్రి సంస్థ మరోసారి భారీ రిస్కు తీసుకుని లాభాలు పొందింది .. డబుల్ రిలీజ్ కు డబుల్ కలెక్షన్లతో బాక్సాఫీస్ ను షేక్‌ చేసిన ఈ నిర్ణయం సినిమాటిక్ ప్లానింగ్ కు ఓ గొప్ప ఉదాహరణగా మారినుంది .. అలాగే ఇకపై మైత్రి నుంచి వచ్చే సినిమాలపై కూడా అంచనాలు మరింత పెరిగే అవకాశం కూడా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: