హైదరాబాద్ ఎఫ్ డీ సీ సమావేశ కార్యక్రమంలో ఎఫ్ డి సి చైర్మన్ దిల్ రాజు, తాజాగా జ్యూరీ చైర్మన్గా సినీనటి జయసుధ ఎంపిక అవ్వగా.. వీరి అధ్యక్షతన మొదటిసారి గద్దర్ అవార్డ్స్ జ్యూరీ సమావేశం జరిగింది.సినీనటి జయసుధ చైర్మన్ గా 15 మందితో గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డ్స్ జ్యూరీని ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు ఈ సమావేశంలో స్పష్టం చేశారు. ఇక తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ హరీష్ తెలిపారు. ప్రభుత్వం అప్పగించిన బాధ్యతను ఛాలెంజ్గా తీసుకొని ఈ ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తామని జయసుధ తెలిపారు. అలాగే తెలుగు సినీ రంగానికి జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చే విధంగా వ్యవహరించాలని జ్యూరీ సభ్యులను దిల్ రాజు కోరారు.

ముఖ్యంగా ఈ జ్యూరీ సభ్యులలో నిష్ణాతులైన వారిని ప్రభుత్వం నియమించినట్లు, 14 ఏళ్ల తర్వాత ప్రభుత్వం చలనచిత్ర అవార్డ్స్ ఇస్తున్నట్లు తెలిపారు. ఇక ఉమ్మడి రాష్ట్రంలో కూడా చలనచిత్ర అవార్డ్స్ కి ఇంత స్పందన రాలేదని కూడా ఆయన తెలిపారు. ఇకపోతే గద్దర్ అవార్డ్స్ కి అన్ని కేటగిరీల నుండి సుమారుగా 1,248 నామినేషన్లు లభించినట్లు దిల్ రాజు తెలిపారు. ఈనెల 21వ తేదీ నుండి నామినేషన్ల స్క్రీనింగ్ ప్రక్రియ జరుగుతుంది అని,  ఈ గద్దర్ అవార్డులకు వివిధ కేటగిరీల ఎంట్రీల నుంచి వచ్చిన నామినేషన్ల స్క్రీనింగ్ ప్రక్రియ గురించి సభ్యులతో కూడా చర్చించినట్లు సమాచారం.

ఇకపోతే ఈ పురస్కారాలకు వ్యక్తిగత కేటగిరీలో 1,172 నామినేషన్లు రాగా, ఫీచర్ ఫిలిం, బాలల చిత్రాలు, డెబిట్ చిత్రాలు, డాక్యుమెంటరీ లేదా షార్ట్ ఫిలిమ్స్, ఫిలిం క్రిటిక్స్, పుస్తకాలు తదితర క్యాటగిరిలో దాదాపు 76 దరఖాస్తులు వచ్చినట్లు జ్యూరీ తెలిపింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డులతో నామినేషన్లను నిష్పక్షపాతంగానే పరిశీలించాలని జ్యూరీ సభ్యులను ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు కోరారు.  మొత్తానికైతే త్వరలో గద్దర్ అవార్డ్స్ లభించబోతున్నాయి చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: