
రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించిన మొదటి షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకున్నారు చిత్ర బృందం. త్వరలోనే ఆఫ్రికా అడవులకు వెళ్లబోతున్నారు మూవీ టీం. ప్రజెంట్ కొన్ని ప్రాబ్లమ్స్ కారణంగా రాజమౌళి సినిమా షూటింగ్ కి బ్రేక్ చెప్పినట్లు తెలుస్తుంది . ఈ టైం గ్యాప్ లోనే మహేష్ బాబు వెకేషన్ కి వెళ్ళిపోయారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా ప్రియాంక చోప్రా నటిస్తుంది . ఇప్పుడు ఈ సినిమాలో సెకండ్ లీడ్ పాత్ర కోసం మరొక సెన్సేషనల్ బ్యూటీని చూస్ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఆమె మరెవరో కాదు హీరోయిన్ నయనతార . ఎస్ నయనతార పేరు ఇప్పుడు సౌత్ ఇండియాలో ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో అందరికీ తెలిసిందే . మొదటి నుంచి నయనతార అంటే ఓ వర్గం ప్రేక్షకులకు నచ్చదు . మిగతా అందరికీ నయనతార అంటే బాగా నచ్చుతుంది . మరీ ముఖ్యంగా ఫిమేల్ ఓరియంటెడ్ పాత్రలను ఇష్టంగా చేస్తుంది. ఇప్పుడు నయనతారకు ఈ సినిమాలో ఒక స్పెషల్ క్యారెక్టర్ లో మెరిసే ఛాన్స్ ఇచ్చారట . ప్రజెంట్ ఆమెకు అవకాశాలు సరిగ్గా రావడం లేదు . ఈ క్రమంలోనే ఆమె ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ఈ ప్రాజెక్టును ఓకే చేసిందట . రాజమౌళి - మహేష్ సినిమాలో నయనతార లీడ్ పాత్రలో కనిపించబోతుంది అన్న వార్త ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది..!