
ఇక అప్పటినుంచి ఇప్పటివరకు కూడా గేమ్ ఛేంజర్ సినిమా గురించి ఏదో ఒక వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా పైన తమిళ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. గేమ్ ఛేంజర్ సినిమాకు కథ ఇచ్చింది తానే అని.. ఆ కథ వేరే అంటూ తెలిపారు. ప్రస్తుతం తాను హీరో సూర్యతో రెట్రో సినిమా చేయగా మే ఒకటో తేదీన రిలీజ్ అవుతూ ఉండగా ప్రమోషన్స్ లో పాల్గొన్న కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమా పైన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
కార్తీక్ సుబ్బరాజు ఇలా మాట్లాడుతూ.. నేను శంకర్ సార్ కి కేవలం ఒక లైన్ స్టోరీనే ఇచ్చానని అది కూడా ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ కథ అని.. అయితే ఆ తర్వాత ఒక డిఫరెంట్ ప్రపంచంలో మార్చేశారు చాలామంది రైటర్స్ వచ్చి కథని, స్క్రీన్ ప్లేను మార్చేయడం జరిగిందని తెలిపారు. దీంతో కార్తీక్ సుబ్బరాజు చేసిన ఈ వ్యాఖ్యలు మెగా అభిమానులను హర్ట్ అయ్యేలా చేస్తున్నాయి. డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు ఇచ్చిన కథని చేసి ఉంటే సినిమాకి ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. అయితే గతంలో డైరెక్టర్ శంకర్ ఈ సినిమాని తాను ఐదు గంటలకు పైగా తెరకెక్కించాలనుకున్నాను అంటూ తెలిపారు.