SSMB 29ను పాన్ వరల్డ్ రేంజ్‌లో ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుధీరుడు రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే రెండు స్కెడ్యూలను పూర్తి చేసుకుంది. మూడవ‌ స్కేడ్యుల్‌కు ప్రస్తుతం రంగం సిద్ధమవుతుంది. హైదరాబాద్‌లో ఈ షెడ్యూల్ జరగనుంది. ఆఫ్రికన్ అడ్వెంచర్స్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాల్లో.. మహేష్ బాబు రోల్ ఏంటి అనే అంశంపై ఆడియన్స్‌లో ఇప్పటికే విపరీతమైన సస్పెన్స్ నెట‌కొంది. ఇలాంటి క్ర‌మంలో మూవీ విల‌న్ రోల్‌పై అదిరిపోయే ట్విస్ట్ రివీల్ అయ్యింది. ఇక మూవీ విల‌న్ పాత్రలో పృథ్వి రాజ్కుమార్ నటిస్తున్నాడని టాక్ వ‌చ్చినా.. ఇప్పుడు పూర్తిస్థాయి విలన్ మాత్రం పృథ్వీరాజ్ కాదని తెలుస్తుంది.
 

ఈ విషయాన్ని రాజమౌళి రివిల్ చేయకున్నా.. గ్లోబల్ లెవెల్లో రూపొందిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబును ఢీకొట్టే ప్రతి నాయకుడు కూడా అదే లెవెల్ లో ఉండేలా ప్లాన్ చేశాడని.. అయితే దీనిని కావాలనే జక్కన్న గోప్యంగా ఉంచినట్లు సమాచారం. ఇక ఓ నల్లజాతీయుడు హాలీవుడ్ లో ఇమేజ్ ఉన్న నటుడు.. మూవీలో విలన్ గా కనిపించనున్నాడట‌. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగుతున్న ఈ కథలో.. అదే ప్రాంతానిక చెందిన వ్యక్తి విలన్ గా కనిపించనున్నాడని టాక్. అయితే ఆ న‌టుడు ఎవరనేదాన్ని మాత్రం జక్కన్న ఇంకా సీక్రెట్ గానే ఉంచాడట. ప్రతి నాయకుడు పాత్ర విషయంలో ఇలాంటి సీక్రెట్స్ మైంటైన్ చేయడం జక్కన్నకు అలవాటే.

 

బాహుబలి లో పెద్దగా ఆడియన్స్ కు పరిచయం లేని ప్రభాకర్‌ను కాల‌కేయ‌ పాత్రలో నటింపజేసాడు. ఈ సినిమాతో ప్రభాకర్‌కు తిరుగులేని ఇమేజ్ ఏర్పడింది. ఇక రాజమౌళి గతంలో తెర‌కెక్కించిన విక్రమార్కుడు సినిమాలోను కేవలం చిన్న పాత్రలో నటించే అజయ్‌నీ టిట్లా పాత్రలో పవర్ఫుల్ విలన్ గా నటింపచేసాడు. ఇక ఈ సినిమా తర్వాత అజయ్ కు విపరీతమైన పాపులారిటీ ఏర్పడింది. అలాగే ఆర్‌ఆర్ఆర్ సినిమా లోను తెల్లజాతీయులు విలన్ గా కనిపించిన సంగతి తెలిసిందే. అప్పటివరకు అసలు వాళ్ళు ఎవరో కూడా ప్రపంచానికి పరిచయం లేని వాళ‌ను విలన్ గా తీసుకొని సినిమా హిట్ కొట్టాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు అదే లక్కీ స్ట్రాట‌జీ ఎస్ఎస్ఎంబి 29 కు కూడా జక్కన్న వాడుతున్నాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: