మన పొరుగు దేశం చైనా అభివృద్ధిలో దూసుకెళ్లిన సంగతి అందరికి తెలిసిందే. కానీ అవినీతిలో కూడా చాలా ముందుకు దూసు కెళ్తుంది. మన కంటే వెనుక స్వాతంత్య్రం పొందిన డ్రాగన్.. మన కంటే ఎక్కువగా పేదరికంలో మగ్గిన పరిస్థితి నుంచి మనల్ని మించిపోయేలా ఎదిగింది. కానీ అదే సమయంలో అభివృద్ధితోపాటు అవినీతి కూడా చైనాలో భారీగా చోటు చేసుకుంది. అధికారం కొందరి గుప్పిట్లోనే ఉండిపోవడంతో.. దొరికిన వారు దొరికినంత దోచుకున్నారు. అవినీతికి పాల్పడిన అధికారులు, కమ్యూనిస్టు పార్టీ నేతలపై ఇటీవలి కాలంలో జిన్పింగ్ ఫోకస్ పెట్టారు.
ఓ మాజీ మేయర్ను టార్గెట్ చేసి ఆయన నివాసాలపై నేషనల్ సూపర్వైజరీ కమిషన్ అధికారులు దాడులు చేశారు.. కళ్లు చెదిరే మొత్తంలో ఆస్తులు, బంగారం బయటపడ్డాయి ఆ దాడులలో. బంగారం అంటే మన దగ్గర దొరికినట్టు కిలోల చొప్పున కాదు.. టన్నుల్లో బంగారం దొరికింది. హైకౌ నగర మాజీ మేయర్ అయిన 58 ఏళ్ల ఝాంగ్ కి ఇంట్లో 13.5 టన్నుల బంగారం దొరికింది. బిస్కెట్ల రూపంలో పసిడి గుట్టలు గుట్టలుగా ఉండడం గుర్తించి అధికారులు అక్షర్యా పోయారు. ఆ బంగారం విలువే అక్షరాలా రూ.4,500 కోట్లు కావడం చాలా గమనార్హం.
బాబోయ్ అని అప్పుడే అనుకోకండి..ఇంకా ఉన్నాయి కమ్యూనిస్టు పార్టీ నేత కూడా అయిన సదరు అధికారి దగ్గర దొరికిన సొమ్మెంతో తెలిస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి అందరికి. మన కరెన్సీలో చెప్పాలంటే 2.64 లక్షల కోట్ల రూపాయల నగదును ఆయన ఇంటి బేస్మెంట్లో, బ్యాంక్ ఖాతాల్లో ఉనంట్లు గుర్తించారు అధికారులు. ఆయన అవినీతి ఏ స్థాయిలో ఉందంటే.. నగదులో చైనీస్ కరెన్సీ మాత్రమే కాదు... డాలర్లు, యూరోలు కూడా ఉన్నాయట. అంటే అవినీతిలో అంతర్జాతీయ స్థాయి అన్నమాట.
ఇక ఝాంగ్ బ్యాక్ గ్రౌండ్ ఏమిటంటే 90 లక్షల జనాభా ఉన్న హైనియన్ ప్రావిన్స్ రాజధాని హైకౌలో కమ్యూనిస్టు పార్టీ కమిటీ సెక్రటరీగా ఝాంగ్ ఉన్నారు. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం ఆయన పదవి మేయర్కు సమానం. గతంలో హైనియన్ ప్రావిన్స్ స్టాండింగ్ కమిటీ మెంబర్గానూ ఆయన పని చేశారు. సదరు నేత అవినీతికి పాల్పడ్డాడని అధికారికంగా తెలిస్తే మాత్రం ఆయనకు మరణశిక్ష విధించే అవకాశాలు కూడా ఉన్నాయి.