
అయితే వారి అవస్థలను గ్రహించిన స్థానిక మీడియా కథనాలను ప్రచురించింది. అయితే ఈ వార్తా కథనాలు ఇండియన్ కాన్సులేట్ కార్యాలయం దృష్టికి వచ్చాయి. దీనితో ఇండియన్ కాన్సులేట్ కార్యాలయం అధికారులు లోకల్ సోషల్ కార్యకర్తల సహాయంతో ఎనిమిది మంది భారతీయులకు వసతి కల్పించారు. అలాగే ఎనిమిది మంది తమ స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు అరేంజ్ చేశారు. దీంతో ఎట్టకేలకు ఈ ఎనిమిది మంది భారతీయులు స్వదేశానికి తిరిగి చేరుకున్నారు.
ఈ నేపథ్యంలో కాన్సులేట్ కార్యాలయం అధికారులు నిరుద్యోగులను హెచ్చరించారు. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే మనుషులను అసలు నమ్మకండి.. ఉద్యోగ ప్రకటనల విషయంలో అప్రమత్తంగా ఉండండి అని వ్యాఖ్యానించారు. ఉద్యోగ ప్రకటనలను నమ్మితే కష్టపడి సంపాదించిన డబ్బు పోగొట్టుకోవడమే కాదు పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుందని అధికారులు హెచ్చరించారు. అంతేకాకుండా ప్రవాసీ భారతీయ సహాయత్ కేంద్ర (పీబీఎస్కే) యాప్ ద్వారా ఏజెంట్లు ఉద్యోగాల గురించి చెప్పే విషయాలలో నిజమెంతో అబద్ధమెంతో తెలుసుకోవాలని సూచించారు.