
ఇక రష్యా సేనల భీకరమైన దాడుల నేపథ్యంలో ప్రస్తుతం అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇలాంటి సమయంలోనే ఇక తాము ఎంతో వీరోచితంగా పోరాటం చేస్తున్న రష్యా సైనికులను వందలమందిని మట్టు పెడుతున్నాము అంటూ ఉక్రెయిన్ రక్షణ శాఖ చెబుతూ ఉండటం గమనార్హం. ఇక ఇలాంటి సమయంలో ప్రస్తుతం ఉక్రెయిన్ లో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి అన్నది అర్ధమవుతుంది. యుద్ధంలో మరణించిన రష్యన్ సైనికుల మృతదేహాలను ఉక్రెయిన్ సైనికులు అలాగే వదిలేస్తున్నారు అన్న విషయం ఇటీవల బయటపడింది.
ఉక్రెయిన్లోని ఖార్కివ్ నగరం లో యుద్ధం లో మరణించిన రష్యా సైనికుల మృతదేహాలు మంచుల్లో కూరుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల ఒక జర్నలిస్టు డెడ్ బాడీ లు ఇలా వదిలేసారు ఏమిటి అని అడుగగా... ఏకంగా రష్యన్ సైనికులు డెడ్ బాడీ లను కుక్కల కోసం వదిసామ్ అంటూ సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. తమ మాతృదేశాన్ని ఆక్రమించుకునేందుకు వచ్చిన వారిపై సింహాల్లా పోరాటం చేస్తున్నామని తమ వారిని తప్పక కాపాడుకుంటాం అంటూ ఉక్రెయిన్ సైనికులు చెబుతున్నారు అని తెలుస్తోంది. ఇలా ఏకంగా రష్యన్ సైనికులు మృతదేహాలను కుక్కలు తినేందుకు వదిలేసామని సైనికులు సమాధానం చెప్పడంతో అందరూ షాక్ అవుతున్నారు..