రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఉక్రెయిన్ రష్యా భీకర రీతిలో దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో ఇక ఉక్రెయిన్లో నెలకొన్న అల్లకల్లోల పరిస్థితుల పై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రష్యా దాడిలో ఉక్రెయిన్ లో మారణహోమమే జరుగుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం మొదలై దాదాపు రెండు వారాల గడిచిపోతున్నాయి. పరిస్థితుల్లో మాత్రం ఎక్కడా మార్పు రావడంలేదు. రోజురోజుకు యుద్ధ తీవ్రత పెరుగుతుంది తప్ప ఎక్కడా తగ్గుముఖం మాత్రం పట్టడం లేదు అని చెప్పాలి. అయితే యుద్ధం ఉక్రెయిన్ కు అండగా ఉంటాము అంటూ చెప్పిన అమెరికా ఎలాంటి సహకారం అందించడం లేదు.



 కేవలం మొక్కుబడిగా మాత్రమే కొన్ని ఆయుధాలను ఇస్తూ ఉంది. ఇక అదే సమయంలో ఆర్థిక ఆంక్షలు విధిస్తూ ఉండటం గమనార్హం. దీంతో ఇక అమెరికాను నమ్ముకొని రష్యాను ఎదుర్కొనేందుకు సిద్ధమైన ఉక్రెయిన్ ఇప్పుడు అగ్రరాజ్యం తో ఒంటరిగానే పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సమయంలో కొన్ని దేశాలు ఉక్రెయిన్ కి మద్దతు పలుకుతూ ఉంటే మరికొన్ని దేశాలు రష్యా కు మద్దతు పలుకుతూ ఉన్నాయి. అయితే అటు భారత్ మాత్రం ఒకవైపు రష్యాకు మరోవైపు ఉక్రెయిన్కు మద్దతు పలకకుండా తటస్థ వైఖరిని అవలంబిస్తోన్నాయ్. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచిస్తుంది.


 ఈ క్రమంలోనే భారత్ వ్యవహరిస్తున్న తీరుపై ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ షాకింగ్స్ కామెంట్స్ చేశాడు. రష్యాతో మాట్లాడేందుకు భారత్ భయపడుతుంది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసాడు.  ఇక ఆ దేశంపై భారత్ నిర్ణయాల్లో అస్థిరత కనిపిస్తోంది అంటూ వ్యాఖ్యానించారు బైడెన్. క్వాడ్ దేశాలైన అమెరికా ఆస్ట్రేలియా జపాన్ భారత్  ఒక్క తాటిపైకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ విషయంలో భారత్ బలహీనంగా ఉందని జపాన్ ఆస్ట్రేలియా పటిష్టంగా కన్పిస్తోందని అంటూ చెప్పుకొచ్చాడు అమెరికా అధ్యక్షుడు బైడెన్.

మరింత సమాచారం తెలుసుకోండి: