రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య ఎంత భీకరమైన  యుద్ధం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు గత సంవత్సర కాలం నుంచి యుద్ధం జరుగుతున్నప్పటికీ.. పరిస్థితుల్లో మాత్రం ఎక్కడ మార్పు రావడం లేదు. అయితే ఈ యుద్ధంలో అటు వేల మంది సైనికులతో పాటు ఎంతోమంది అభం శుభం తెలియని సామాన్య ప్రజలు చనిపోతున్న ఇక రెండు దేశాల ప్రభుత్వాలు మాత్రం వెనక్కి తగ్గడం లేదు అని చెప్పాలి. ఉక్రెయిన్ పై ఆదిపత్యాన్ని సాధించడం కోసం రష్యా ఇక తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం కోసం యుద్ధం కొనసాగిస్తూ ఉంది సాగిస్తూ ఉంది.


 అయితే అటు రష్యా తో పోల్చి చూస్తే ఉక్రెయిన్ పసికూన దేశం అయినప్పటికీ.. అగ్ర దేశమైన రష్యాకు గట్టిగా బదిలిస్తుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ దాటిని తట్టుకోలేకపోతున్న రష్యా తమ దగ్గర ఉన్న అన్ని ఆయుధాలకు పని చెబుతూ ఉంది. ఈ క్రమంలోనే ఇక ఇరు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవాలి అని ప్రపంచ దేశాలు సూచిస్తున్నప్పటికీ ఇక ఈ రెండు దేశాల మధ్య యుద్ధం మాత్రం ఆగడం లేదు. అయితే ఇక తమ దేశ భద్రతకు భద్రంగం వాటిలితే ఏకంగా అణు ఆయుదాలను కూడా ప్రయోగిచేందుకు  సిద్ధంగా ఉన్నామంటూ రష్యా హెచ్చరించింది.



 ఇకపోతే మరోసారి రష్యా ఇలాంటి షాకింగ్ ప్రకటన చేసింది రష్యా. తాము స్వాధీనం చేసుకున్న జపోరీజ్జియాలోని ఒక గ్రామాన్ని ఉక్రెయిన్ స్వాధీనం చేసుకుంది. ఇక ఈ విషయాన్ని రష్యా అధికారికంగా ప్రకటన చేసింది. గత 16 నెలలుగా ఇరు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతుండగా గతవారం రోజుల్లోనే సుమారు 100 చదరపు  కిలోమీటర్ల విస్తీర్ణాన్ని తమ అధీనంలోకి తెచ్చుకుంది ఉక్రెయిన్. ఈ క్రమంలోనే ఇక అటు ఇరుదేశాల మధ్య శాంతియుతంగా యుద్ధంముగించే దిశగా చర్చలు కూడా జరుగుతూ ఉండడం గమనార్హం. అయితే అమెరికా ఇస్తున్న సపోర్ట్ తోనే అటు ప్రతిష్టమైన రష్యాను ఉక్రేయిన్ ఎదుర్కోగలుగుతుంది అని ప్రస్తుతం ప్రపంచ దేశాలు చర్చించుకుంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: