ముందుగా చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ వైరస్ క్రమక్రమంగా.. ప్రపంచం మొత్తం పాకిపోయింది. దీంతో చైనా ప్రపంచంలోనే అగ్ర దేశంగా ఎదిగేందుకు ఇక కరోనా వైరస్ రూపంలో ఒక బయోవేపెన్ ను ప్రయోగించింది అంటూ ప్రపంచ దేశాలు ఆరోపించాయి. కరోనా వైరస్ ఎంతో ప్రమాదకరమైనది అన్న విషయం ముందే చైనాకు తెలుసని.. నిజాలను దాచి ప్రపంచ వినాశనానికి చైనా ప్రయత్నించింది అంటూ ఇక ఎంతో మంది శాస్త్రవేత్తలు కూడా ఆరోపణలు చేశారు. ఇక కరోనా వైరస్ నేపథ్యంలో కొన్ని దేశాలు చైనా విషయంలో కాస్త కఠిన ఆంక్షలు విధించడం కూడా జరిగింది అని చెప్పాలి.
అయితే చైనాలో పుట్టుకొచ్చిన కరోనా వైరస్ గురించి ఇక ఆ దేశ రీసెర్చర్ చావొ షావో ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. వైరస్ ను చైనా సృష్టించిన బయో వెపన్ అంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆ శాస్త్రవేత్త వ్యాఖ్యానించారు. చైనాలోని ఊహన్ ల్యాబ్ లో ఏకంగా నాలుగు రకాల కరోనా వైరస్లను తయారు చేశారు. అయితే ఏ వైరస్ ఎక్కువ మందిపై ప్రభావం చూపుతుంది అనే విషయంపై కూడా రీసెర్చ్ చేశారు. ఇక ఇందులో ఇతర జీవులను వినియోగించారు. ఒక ఆ తర్వాత 2019లో మిలటరీ వరల్డ్ గేమ్స్ సందర్భంగా క్రీడాకారుల గదుల్లోకి శాస్త్రవేత్తలను పంపించి ఇక వైరస్ వ్యాప్తి చెందేలా చేసారు అంటూ చైనా శాస్త్రవేత్త చావొ షావో సంచలన వ్యాఖ్యలు చేశారు.