వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కారు ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ పై ఈనాడు దినపత్రిక అద్భుతమైన కవరేజ్ అందించింది. ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో బడ్జెట్ పై అద్భుతంగా ప్రత్యేక కథనాలు రాసింది. ఈనాడు మాస్ట్ హెడ్ ను పక్కకు పెట్టి మరీ ప్రత్యేకంగా కవరేజ్ ఇచ్చింది.


నవ సంక్షేమం అంటూ నవరత్నాలకు జగన్ సర్కారు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిందనేలా కథనాలు రాసింది. ప్రధాన రంగాలపై ఒక్కో రంగంపై ఒక్కో పేజీలో సవివరంగా కథనాలు ఇచ్చింది. సర్వజన శ్రేయస్సుకు నవరత్నాలుకు అండగా జగన్ సర్కారు నిలించిందని కితాబిచ్చింది.


వ్యవసాయానికి కూడా జగన్ సర్కారు బాగా నిధులు కేటాయించిందని ఈనాడు అభిప్రాయపడింది. చక్కని సాగుకు నిధులు భళా అంటూ ప్రత్యేక కథనం వెలువరించింది.  అన్నదాతపై పెద్దమనసు, బీసీ సంక్షేమానికి అధనం, సాగునీటి యజ్ఞం, విద్యారంభం కరిష్యామి, గూడు కట్టి నీడ నిచ్చి.. అంటూ దాదాపు ఐదు ఫుల్ పేజీల్లో బడ్జెట్ పై విశ్లేషణాత్మక కథనాలు అందించింది.


ఇలా ప్రత్యేక పేజీల్లో ప్రత్యేక గ్రాఫిక్స్ తో బడ్జెట్ ను ఈనాడు కవర్ చేసిన తీరు పాఠకులను మెప్పించింది. మొత్తం మీద బడ్జెట్ పై ఈనాడు కవరేజ్ చూసి వైసీపీ నేతలు కూడా మురిసిపోయేలా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: