
టీడీపీ నేత నారా లోకేశ్ పై మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి మరోసారి మండిపడ్డారు. లోకేష్కు ట్వీట్లలో తప్ప బయట మాట్లాడే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి తేలి చెప్పారు. స్థానికులకు కూడా తెలియని ప్రాంతాల్లో చంద్రబాబు అనుచరులు భూములు కొనుగోలు చేశారని వివరాలు అసెంబ్లీ ముందు ఉంచారు. హెరిటేజ్తో పాటు చంద్రబాబు అనుచరులు, టీడీపీ నేతలు 4 వేలకు పైగా ఎకరాలను ముందుగానే కొనుగోలు చేశారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు.
చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిందని జపాన్ కంపెనీ లేఖ రాసిన విషయాన్ని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బయటపెట్టారు. మూడు రాజధానుల వల్ల అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరుగుతుందని.. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని విస్మరిస్తే ఉద్యమాలు వస్తాయని చరిత్ర చెబుతోందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వివరించారు. అందుకే ఒకే ప్రాంతం కేంద్రంగా అభివృద్ధి చేయడం లేదు. శ్రీబాగ్ ఒప్పందం కూడా ఇదే విషయాన్ని చెప్పింది. ఉత్తరాంధ్ర వెనుకబడి ఉందని శ్రీకృష్ణ కమిటీ కూడా చెప్పిందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గుర్తు చేశారు.
మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇంకా ఏమన్నారంటే.. “ పాలన వికేంద్రీకరణ జరగాలని శివకృష్ణన్ కమిటీ చెప్పింది. వ్యవసాయ భూములను రాజధాని కొరకు ఉపయోగిస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారానికి దారి తీస్తుందని కమిటీ ముందే హెచ్చరించింది. శివరామకృష్ణన్ కమిటీ పర్యటిస్తున్న సమయంలోనే చంద్రబాబు మరో కమిటీ వేశారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను చంద్రబాబు పట్టించుకోలేదు.”
" గత ఐదేళ్లూ చంద్రబాబు అహంకారం ధోరణిలో పాలన సాగించారు. విభజన చట్టంలోని హామీలను గత ప్రభుత్వం సాధించలేకపోయింది. భవనాలు కట్టుకోవాలి కానీ నగరాలు కాదు. అన్ని ప్రాంతాల అభివృద్ధికి వికేంద్రీకరణ బిల్లుకు నిండు మనసుతో ఆమోదించాలని కోరుతున్నానని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో తెలిపారు.