ఎన్నికల్లో ప్రతిపక్షం వారు ఆయన్ని విమర్శించలేక జగన్ మాత్రమె విమర్శిస్తూ ప్రచారం చేశారంటే అయన వారికి కష్ట సమయాల్లో ఎంత అండగా ఉంటారో అర్థం చేసుకోవచ్చు..తమ ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు విమర్శించకపోవడమే కాదు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయనపై విపాశాలు పెద్ద గా విమర్శలు చేసేవారు కాదు.. ముఖ్యమంత్రి మేనమామ కావడంతో ప్రతిపక్ష నేతలు కూడా ఇక్కడ బయటకు వచ్చి విమర్శించే సాహసం చేసేవారు కాదు.. ఇక ఆయన మొహం చూసి చాలామంది టీడీపీ నేతలు వైసీపీ లోకి వచ్చేశారు అంటే ఆయన మంచి తనం గురించి చెప్పుకోకపోవడమే మంచిది..
ఏదేమైనా అన్ని నియోజక వర్గాల్లో మరో నాలుగేళ్లు సైలెంట్గా ఉండి పనులు చేయించుకోవాలని కూడా ప్రతిపక్ష నేతలు ఓ నిర్ణయానికి వచ్చేశారు. అందుకే అన్ని వైసీపీ సీట్లలో నేతలు అనిగిమనిగి ఉన్నారట.. ఇక రవీంద్రనాథ్రెడ్డి అవినీతి పరుడు కాదని అందరికి తెలిసినా అయన పేరు చెప్పుకుని కొంతమంది ఉత్సాహవంతులు దోచుకుంటున్నారని అంటున్నారు.. ఈయన ప్రాంతంలో 14-15 ఇసుక రీచ్లు ఉన్నాయి.. ఆయన పేరు చెప్పుకొని.. కొందరు మాత్రం వెనుకేసుకుంటున్నారట. మంత్రి పదవి పై కొంత సందేహం ఉన్నా త్వరలో మేనమామకు ఉన్న ఆ ముచ్చట కూడా తీర్చేస్తారట జగన్..