
లోక్సభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమాచారం ప్రకారం పార్లమెంట్ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. నిర్ణయించిన షెడ్యూల్ కంటే ఎనిమిది రోజుల ముందుగానే ఈ సమావేశాలు ముగియనుండడం గమనార్హం. ఈ విషయంపైన గత శనివారం కేంద్ర ప్రభుత్వం సమావేశంలోనూ ప్రతిపక్షాలతో చర్చించింది. ఇటీవల సమావేశాలకు హాజరైన ముగ్గురు ఎంపీలకు కరోనా వైరస్ రావడంతో కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది.కరోనా భయాల మధ్య ఉభయ సభల సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు. 30 మంది ఎంపీలు కరోనా బారిన పడడంతో లోక్సభను వాయిదా వేయాలన్న ఆలోచనలో ఉన్నారు స్పీకర్ ఓంబిర్లా. పార్లమెంట్ సెషన్స్కు ముందే లోక్సభకు చెందిన 17 మంది ఎంపీలు, ఎనిమిది మంది రాజ్యసభ సభ్యులు వైరస్ పాజిటివ్గా పరీక్షించారు.అలాగే రాజ్యసభ సైతం వాయిదా పడే అవకాశం ఉంది. మరి కరోనా వైరస్ బారిన పడిన ప్రజాప్రతినిధులు త్వరగా కోలుకోవాలని దేవుని ప్రార్ధిద్దాము.