ప్రభుత్వ అసమర్థత కారణంగానే ప్రజలకు సరైన రక్షణ కల్పించక పోవడంతో నే రాష్ట్రంలో కిడ్నాప్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని ప్రతిపక్ష పార్టీలు తెలంగాణా ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇక ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రభుత్వం పై తనదైన శైలిలో తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ ప్రభుత్వ తీరుని ఎండగడుతూ ఉంటుంది తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత విజయశాంతి. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో పెరిగిపోతున్న కిడ్నాప్ కేసుల ఈ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుంచి పెరిగిపోతున్న కిడ్నాప్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి అంటూ ఇటీవలే సినీనటి తెలంగాణ కాంగ్రెస్ నేత విజయశాంతి వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఏకంగా 200 మంది కిడ్నాప్ కి గురవడం ఎంతో దిగ్భ్రాంతికి గురి చేస్తోంది అంటూ విజయశాంతి తెలిపారు. రాష్ట్రంలో క్రమక్రమంగా పెరిగి పోతున్న కిడ్నాప్ ఘటనలను ప్రభుత్వం సీరియస్గా తీసుకుని కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు విజయశాంతి. ప్రజలందరిలో కలవరం మొదలు కాకముందే అందరూ అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది అంటూ చెప్పుకొచ్చారు. అటు క్రమక్రమంగా పెరిగి పోతున్న కిడ్నాప్ కేసులో తెలంగాణ ప్రజానీకం మొత్తం భయాందోళనలో మునిగి పోతుంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ జీవితాన్ని గడుపుతున్నారు.