ఇక మరి కొంతమంది ప్రజాప్రతినిధులకు సంబంధించిన బంధువులము అంటూ చెబుతూ ఎన్నో మోసాలకు పాల్పడుతున్న ఘటనలు కూడా తెర మీదకి వస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటి ఘటన జరిగింది ఏకంగా మంత్రి కేటీఆర్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నాడు ఇక్కడ ఒక వ్యక్తి. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి పేరు చెప్తే నమ్ముతారు నమ్మరు అనుకున్నాడో ఏమో.. ఏకంగా తెలుగు రాష్ట్రాల్లో బాగా పేరున్న కేటీఆర్ పేరు చెప్పి మోసాలకు పాల్పడుతూ భారీగా డబ్బులు దండుకుని జల్సాలకు అలవాటు పడ్డాడు ఇక్కడ ఒక వ్యక్తి.
ఈ క్రమంలోనే కేటీఆర్ పీఏ అంటూ ఎంతో మంది దగ్గర డబ్బులు గుంజుతూ మోసాలకు పాల్పడుతున్న ఏపీ మాజీ రంజీ ప్లేయర్ ను అరెస్టు చేశారు పోలీసులు. మంత్రి కేటీఆర్ పీఏ అంటూ పలువురు దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్న నాగరాజు ను ఎంతో చాకచక్యంగా వ్యవహరించి పోలీసులు అరెస్టు చేశారు. పేద క్రికెటర్లకు సహాయం చేసేందుకు డబ్బులు కావాలని తాను కేటీఆర్ పీఏ అంటూ ఓ ఫార్మా కంపెనీకి టోకరా వేసేందుకు ప్రయత్నించాడు. కానీ చివరికి పోలీసులకు చిక్కాడు. గతంలోనూ పలువురు ప్రజాప్రతినిధులు పేరు చెప్పి లక్షల్లో డబ్బులు వసూలు చేసిన నాగరాజు పై తెలుగు రాష్ట్రాల్లో పలు కేసులు ఇప్పటికే నమోదయ్యాయి.