ఇలాంటి క్రమంలోనే టీకా తీసుకున్న వారు మృతి చెందారు అనే వార్తలు కూడా అందరిని మరింత కలవరపెడుతున్నాయి.. అయితే ఇటీవలే దేశీయ వ్యాక్సిన్ కోవాక్సిన్ తీసుకున్న ఒక వాలంటీర్ మృతిచెందడంతో ప్రజలందరూ ఆందోళన చెందుతున్నారు. కోవాక్సిన్ తీసుకున్న తర్వాత వాలంటీర్ పది రోజులకు మృతిచెందాడు అనే వార్తలు ప్రస్తుతం కలకలం సృష్టిస్తున్నాయి. మూడవ దశ క్లినికల్ టైల్స్ పూర్తి చేయకుండానే అనుమతి ఇవ్వడం పట్ల ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుండగా ఇలాంటి వార్తలు ప్రజలను మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి.
భూపాల్ కు చెందిన దీపక్ అనే 42 ఏళ్ల వ్యక్తి డిసెంబర్ 12వ తేదీన పీపుల్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ లో నిర్వహించిన కోవాక్సిన్ ట్రయల్స్ లో పాల్గొని వ్యాక్సిన్ తీసుకున్నాడు. ఇక పది రోజుల తర్వాత మరణించాడు. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే దీనిపై మాట్లాడిన మెడికల్ కాలేజీ వైస్ ఛాన్స్లర్.. విషప్రయోగం కారణంగానే అతను చనిపోయాడు అని అనుమానిస్తున్నామూ. మరణానికి అసలు కారణమేంటో తెలియరాలేదు అంటూ చెప్పుకొచ్చారు. ఏదేమైనా ఈ వార్త మాత్రం ప్రస్తుతం ప్రజలందరినీ ఎంతగానో భయాందోళనకు గురి చేస్తోంది.