షర్మిల పార్టీ ను ఎప్పుడు స్థాపించారు పోతున్నారు అన్నదానిపై సరైన స్పష్టత లేకపోయినప్పటికీ పార్టీ స్థాపిస్తారు అని మాత్రం ఇక ఆమె చెప్పడంతో.. ఎంతోమంది షర్మిల పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు అన్న విషయం తెలిసిందే. కేవలం ఇతర పార్టీల నేతలు మాత్రమే కాదు ఇప్పటి వరకు అసలు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేని వారు కూడా షర్మిలతో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రోజురోజుకు షర్మిల బలాన్ని కూడగట్టుకుని ఇక ఆ తర్వాత పార్టీని స్థాపించి క్రియాశీలకంగా వ్యవహరించ పోతున్నట్లు సమాచారం.
ఇకపోతే ఇటీవలే వైయస్ షర్మిల ను మాజీ భారత క్రికెటర్ అజారుద్దీన్ తనయుడు కలిసి పలు విషయాలపై చర్చలు జరపడం తెలంగాణ రాజకీయాల్లో మరింత ఆసక్తికరంగా మారిపోయింది. కేవలం అజారుద్దీన్ తనయుడు మాత్రమే కాదు భారత టెన్నిస్ ప్లేయర్.. సానియా మీర్జా సోదరి కూడా షర్మిల తో కలిసి చర్చలు జరిపినట్లు సమాచారం. వీరిద్దరూ కలిసి పలు విషయాలపై చాలా సమయం పాటు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరూ వైయస్ షర్మిల తో ఎందుకు సమావేశం అయ్యారు అన్నది మాత్రం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది.