
ఈ మాయదారి వైరస్ శరీరంలోని అన్ని అవయవాలపై దాడి చేస్తుందన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు దీనికి సంబంధించిన మరో విషయం ప్రజల్ని భయపెడుతోంది. ఈ మధ్య కరోనా బారిన పడ్డ ఓ పేషెంట్ ని గమనించగా అతని రక్తనాళాలలో రక్తం గడ్డకట్టినట్లు గుర్తించారు డాక్టర్లు. ఇదే సమస్యను మరో కొంతమంది కరోనా పీడిత వ్యక్తుల్లోనూ గమనించినట్లు తెలిపారు. ఇది కరోనా కారణంగా ఏర్పడిన సమస్య అని చెబుతున్నారు. దీన్ని గుర్తించడం కనుక ఆలస్యమైతే ఆ పేషెంట్ హార్ట్ స్ట్రోక్ వంటి గుండె సంబంధిత వ్యాధుల బారిన పడతారని చెబుతున్నారు.
మే 5న న్యూ ఢిల్లీలోని సర్ గంగా రామ్ హాస్పిటల్ కు చెందిన డాక్టర్ . అంబరీష్ సాత్విక్ ఓ పోస్టు ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. కరోనా రోగి అవయవాల నుండి గడ్డకట్టిన రక్తాన్ని వేరు చేసి బయటకు తీస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇలా గడ్డకట్టిన రక్తాన్ని అవయవాల నుండి వేరు చేసి ఆ పేషెంట్ ప్రాణాలు నిలబెట్టామని పేర్కొన్నారు. దాంతో ఈ విషయం వైరల్ గా మారింది. కరోనాతో మరో కొత్త చిక్కు వచ్చి పడింది. కానీ కంగారు పడొద్దని డాక్టర్స్ చెబుతున్నారు. అయితే వెంటనే కనుక ఈ సమస్యను గుర్తించి ఆ గడ్డకట్టిన రక్తాన్ని వేరు చేయగలిగితే సమస్య ఏమీ ఉండదని చెబుతున్నారు వైద్యనిపుణులు.