కానీ ఇక్కడ మాత్రం పార్సెల్ ఓపెన్ చేసిన అధికారులకు ఎదురైన ఘటనతో ఒక్కసారిగా షాకయ్యారు. కొంత సమయం పాటు భయాందోళనకు గురయ్యారు అధికారులు.. ఏకంగా విదేశాల నుంచి వచ్చిన పార్సెల్ ఓపెన్ చేస్తే ఇక ఆ పార్సిల్లో మొత్తం సాలెపురుగులు ఉన్నాయి. దీంతో ఆ పార్సల్ ఓపెన్ చేసిన అధికారులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన చెన్నై విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ఇక పార్సిల్ లో బతికి ఉన్న 107 సాలెపురుగు లను స్వాధీనం చేసుకున్నారు ఎయిర్పోర్ట్ అధికారులు. వివరాల్లోకి వెళితే... తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి పేరు మీద పార్సిల్ వచ్చింది.
ఇక సాధారణంగానే అధికారులు విదేశాల నుంచి వచ్చిన పార్సిల్లను చెక్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇటీవల వచ్చిన కూడా పార్సిల్ ను చెక్ చేశారు అధికారులు. కానీ ఎందుకో అనుమానం వచ్చింది. దీంతో ఆ పార్సెల్ ఓపెన్ చేసి చూశారు. ఇక ఒక్కసారిగా అధికారులు అందరూ షాక్ అయ్యారు. ఆ పార్సల్ ఓపెన్ చేయగానే అందులో నుంచి సాలెపురుగులు బయటికి రావడం మొదలుపెట్టాయి. ఏకంగా ఆ పార్సిల్ లో 107 సాలెపురుగులు ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. పోలాండ్ నుంచి వీటిని దిగుమతి చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇక ఈ 107 సాలె పురుగు లను స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఏదేమైనా ఒక్కసారిగా విదేశీ పార్సిల్లో సాలెపురుగులు బయటికి రావడం మాత్రం ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారిపోయింది.