ఇక ఆ తర్వాత ఉమా స్థానిక సంస్థల ఎన్నికల్లో మైలవరం నియోజకవర్గం మొత్తం మీద కేవలం 5 సర్పంచ్ స్థానాలతో సరి పెట్టుకుని ఘోరంగా ఓడిపోయారు. ఇక ఇప్పుడు ఆయన నియోజకవర్గంలోనే ఉన్న కొండపల్లి మున్సిపాల్టీ ఎన్నికలు ఉమా కెరీర్కు అగ్ని పరీక్షగా మారాయి. కొండపల్లి మున్సి పాల్టీ అయ్యాక ఈ మునిసిపాలిటీకి తొలిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ ఎలాగైనా ఇక్కడ వైసీపీ జెండా ఎగర వేసి ఉమా కు పూర్తి గా చెక్ పెట్టేయాలని భావిస్తున్నారు.
దీంతో ఉమా ఈ సారి అయినా గెలిచి పరువు నిలుపు కోవాలని అష్ట కష్టాలు పడుతున్నారు. మరో వైపు ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ కు తోడు ఇటీవల ఎమ్మెల్సీ గా ఎన్నికైన ( ఇప్పటికే అభ్యర్థిత్వం ఖారారు అయ్యింది.. ఎమ్మెల్సీ కావాడం లాంఛనమే.) తలశిల రఘురాం పట్టుబట్టి మరీ ఇక్కడ మకాం వేసి ఉమా పరువు మరోసారి తీయాలని కసితో పని చేస్తున్నారు. మరి ఉమా ఈ సారి అయినా గెలిచి తానేంటో ఫ్రూవ్ చేసుకుంటారా ? లేదా ? అన్నది చూడాలి.