థియెటర్స్ లలో  సినిమాలు రావడం చాలా తక్కువ..వచ్చిన సినిమాలకు జనాలు రావడం చాలా తక్కువ. ఈ క్రమంలో అక్కడ ఉన్న స్టాల్స్ లో ఏదైనా కొనాలంటే ప్రజలు భయంతో వణికిపోతున్నారు. మల్టీప్లెక్స్, థియేటర్లలో 'దోపిడీ' ఆగడం లేదు. ప్యాకేజ్డ్‌ కమొడిటీస్‌ చట్టం అమలు కేవలం మూడు రోజుల ముచ్చటగా మారింది. థియెటర్స్ లలో ప్రభుత్వం నిర్దెసించిన ధరలకు అన్ని రకాల వస్తువులు, ఆహార పదార్థాలు విక్రయించాలన్న వాటికి ఎవరూ కట్టుబడికి ఎవరూ లేరు.


ఆల్రెడీ ప్యాక్‌ చేసిన కొన్ని వస్తువుల ఎమ్మార్పీపై సైతం బాదేస్తున్నారు. ఆహార పదార్థాలపై మాత్రం ఇష్టారీతిన స్టిక్కర్లు వేసి అమ్మకాలు జొరుగా చెస్తున్నారు. మంచినీళ్ళ బాటిల్ నుంచి పాప కార్న్ వరకూ అన్నిటి పై ధరల మోత మోపుతున్నారు.400 ఎంఎల్‌ కోకాకోలా ధర రూ.70, ఎగ్‌పఫ్‌ రూ.50, సమోసా 40. పాప్‌కార్న్‌ రూ.160కు విక్రయించడం సర్వసాధారణమైంది.. కూల్ డ్రింక్స్, చిప్స్ వంటి వాటి పై ధరలను చూస్తె మాత్రం కళ్ళు చెమ్మగిల్లడం ఖాయం.  అంత ఎక్కువ రేట్లను చెబుతున్నారు.

ప్రభుత్వం తీసుకు వచ్చిన నిభంధనలు ఇవే..

తినే వస్తువులు,మంచినీటి బాటిళ్లు, కూల్‌డ్రింకులు నిర్ణీత ధరలకే విక్రయించాలి. విడిగా అమ్మే తినుబండారాలు అందించే కంటైనర్లపై బరువు, పరిమాణం, తయారీ గడువు, తేదీలతో పాటు ఎ మ్మార్పీ స్పష్టంగా కనిపించేలా స్టిక్కర్‌ ఉండాలి. ప్రస్తుతం ఉన్న ధరలను బోర్డులో ఉంచాలి.ధర మారితే ఎప్ప టికప్పుడు మార్పులు, చేర్పులు చేయాలి.

ప్యాకేజ్డ్‌ రూపంలో ఉన్న వస్తువులపై తయారీదారు పూర్తి చిరునామా, వస్తువు పేరు, తయారీ తేదీ, నికర బరువు, ఎమ్మార్పీ, కస్టమర్‌ కేర్‌ వివరాలు ఉంచాలి. ఎమ్మార్పీ రేటు ఉన్న వాటిని మాత్రమే ప్రజలకు అమ్మాలి. అలా లేని వాటిని అమ్మరాదు అని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు.. ఒకవేళ ఎక్కువ ధరలకి విక్రయిస్తె జనాలు ఫిర్యాదులు ఇచ్చిన వాటిని పెద్దగా పట్టించుకోలేదు. అవి అలా కేసులకే పరిమితం అవుతూన్నాయి...

మరింత సమాచారం తెలుసుకోండి: