ఈ క్రమంలోనే కొన్ని రోజుల పాటు చైనా పాకిస్తాన్ మధ్య సంబంధాలు కొనసాగితే ఇక మరింత సంక్షోభంలో కూరుకుపోయే అవకాశం ఉందని భావించిన ఎంతో మంది ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వ తీరుకు నిరసనగా ఉద్యమాలు చేపడుతూ ఉండటం గమనార్హం. ముఖ్యంగా గ్వాదర్ పోర్టులో పాకిస్తాన్ సహజవనరులను అటు చైనా ఎప్పటికప్పుడు ఖాళీ చేస్తూనే ఉంది. ఇలాంటి సమయంలో ప్రజలందరూ ఉద్యమాల బాట పడుతున్నప్పటికీ అటు పాకిస్థాన్ ప్రభుత్వ తీరులో మాత్రం మార్పు రాలేదు అని అర్థమవుతుంది. ఈ క్రమంలోనే ఇటీవల చైనాతో సంబంధాలు మరింత మెరుగుపరుచుకునేందుకు పాకిస్థాన్ కీలక ముందడుగు వేసినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అనే విధంగానే పాకిస్తాన్ వ్యవహరిస్తుంది అని అంటున్నారు విశ్లేషకులు. గ్వాదర్ పోర్ట్ ను లింక్ అప్ చేసేటటువంటి సిపెక్ ఏకానమిక్ కారిడార్ ప్రాజెక్టును కొనసాగించ బోతున్నట్లు ఇటీవల చైనా ప్రకటన చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు గ్వాదర్ పోర్ట్ నుంచి సంపద దూసుకు పోతూ ఉండడం స్థానికులకు ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పించకపోవడంతో ప్రజలు తిరుగుబాటు చేస్తుండగా.. ఇలాంటి సమయంలో పాకిస్థాన్ ప్రభుత్వం తీరులో మార్పు రాకపోవడంతో ఆయుధాలతో పోరాటానికి కూడా సిద్ధం అంటూ ప్రజలు హెచ్చరికలు జారీ చేస్తూ ఉండటం గమనార్హం.