అదే సమయంలో తక్కువ సమయంలోనే అటు ప్రజలకు కూడా పూర్తి స్థాయి అవగాహన రావడంతో ఇక అందరూ స్వచ్చందంగా జాగ్రత్తలు తీసుకోవడం కూడా మొదలుపెట్టారు. అయితే ఇప్పటికే రెండు దశల వైరస్ ను ఎదుర్కొన్న భారత్లో ఇటీవలే మూడవ దశ కూడా ప్రారంభమైంది. ఒకవైపు దక్షిణాఫ్రికా లో వెలుగులోకి వచ్చిన ఓమిక్రాన్ భారత్లో చాపకింద నీరులా పాకిపోయింది. ఇక మరోవైపు కరోనా వైరస్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయాయి. 4 లక్షలకు పైగా కేసులు రావడంతో అందరూ ఆందోళనలో మునిగిపోయారు.
కానీ గత కొన్ని రోజుల నుంచి దేశంలో రోజువారి కరోనా వైరస్ కేసుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుతూ ఉండటం గమనార్హం. ఇక నిన్నటి తో పోల్చి చూస్తే కొత్త కేసుల సంఖ్య 11 శాతం తగ్గింది గడచిన 24 గంటల్లో 14.50 లక్షల మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ క్రమంలోనే 44877 కొత్త పాజిటివ్ కేసులు నమోదు చేసినట్లు తెలుస్తుంది. ఇటీవలే దీనికి సంబంధించిన బులిటెన్ ను కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక దేశవ్యాప్తంగా 684 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలా కరోనా వైరస్ ప్రభావం తగ్గుతూ ఉండటం తో అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు..