దేశంలో ఎన్డీఏ పాలన వచ్చి ఎనిమిది సంవత్సరాలకు దగ్గర పడుతోంది. అయితే దేశంలోని ఎక్కువ మంది ప్రజలు ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ద్వారా నిరాశలో ఉన్నారని చెప్పవచ్చు. దీనికి చాలా కారణాలు ఉన్నా కరోనా సమయంలో విఫలం కావడం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా ఎన్డీఏ కూటమిని ఓడించాలని గట్టిగా అనుకున్నారు. అందులో భాగంగానే తాజాగా అయిదు రాష్ట్రాలలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఫలితం ఖచ్చితంగా బీజేపీకి వ్యతిరేకంగా ఉంటుంది అని అంతా అనుకున్నారు. కానీ తీరా ఎన్నికలు పూర్తి అయిన రోజు నుండి ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం బీజేపీ మళ్లీ సిట్టింగ్ రాష్ట్రాలలో అధికారంలోకి వస్తుంది అని తెలిపాయి.

దీనితో మరోసారి మోదీ హవా ఆయా రాష్ట్రాలలో కొనసాగింది అని చెప్పాలి. అయితే అయిదు రాష్ట్రాలలో ఇప్పుడు అందరి దృష్టి ఉత్తరప్రదేశ్ మీదనే నెలకొంది. ఈ రాష్ట్రంలో మొత్తం 403 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. కాగా ఈ రాష్ట్రంలో విజయం కావాలంటే 202 స్థానాలలో గెలుపొందిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. అయితే ఇవాళ పొద్దున కౌంటింగ్ ప్రారంభం అయిన క్షణం నుండి బీజేపీ లీడింగ్ లో ఉంది. ప్రస్తుతానికి బీజేపీ అధికారానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. మిగిలిన పార్టీలలో సమాజ వాధి పార్టీ 100 కు పైగా స్థానాలతో ఉంటే మిగిలిన పార్టీలు దరిదాపుల్లో కూడా లేవు.

దీనితో ఉత్తరప్రదేశ్ లో మరోసారి బీజేపీ ప్రభుత్వం రానుంది. ఇక ఉత్తరప్రదేశ్ సీఎం గా ఉన్న యోగి ఆదిత్యనాధ్ గోరఖ్ పూర్ నుండి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతానికి యోగి ఆదిత్యానాధ్ 60 వేలకు పైగా ఓట్ల మెజార్టీలో కొనసాగుతున్నారు. అయితే ఈ సారి కూడా సీఎంగా యోగిని కొనసాగిస్తారా లేదా వేరొకరికి అవకాశం కల్పిస్తారా అన్నది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: