టిడిపి నేతల ఫోన్లను సైతం జగన్ ట్యాప్ చేస్తున్నారంటూ తమను ఫాలో అవుతున్నారంటూ కొంతమందిని పట్టుకున్నామంటూ కూడా వెల్లడించారు బోండా ఉమా.. దీనిపైన ఎన్నికల కమిషన్కు కూడా ఫిర్యాదు చేస్తున్నామంటూ వెల్లడించారు.ముఖ్యంగా తమ నాయకుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురందేశ్వరి మొబైల్స్ ను కూడా ట్యాపింగ్ చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. గతంలో కూడా మంత్రులు పెద్దిరెడ్డి ,గుడివాడ అమర్నాథ్ ట్యాపింగ్ చేస్తున్నట్లుగా కూడా వెల్లడించారు బోండా ఉమా.
పార్టీ వర్క్ షాప్ కు కూడా ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్స్ వచ్చారని ఆయన పేరు విశ్వేశ్వరరావు అన్నట్లుగా తెలియజేశారు. ఐజి పంపితేనే వచ్చామంటూ వెల్లడించాలని తెలిపారు బోండా ఉమా.. మరి మొబైల్ ట్యాపింగ్ విషయం పైన ఏపీ సీఎం ఏం మాట్లాడతారో అంటూ ప్రశ్నిస్తున్నారు. అలా పాల్పడిన వారిని విధుల నుంచి తప్పించాలంటూ కూడా డిమాండ్ చేశారని అయితే ఆ కానిస్టేబుల్ను పట్టుకుంటే అన్ని విషయాలు బయటకి వస్తాయంటూ కూడా వెల్లడించారు. తమ మీద నిగా పెట్టడం కంటే డ్రగ్స్ వ్యవహారం పైన దృష్టి పెడితే బాగుంటుందంటూ బోండా ఉమ తెలిపారు. ఈ విషయాన్ని వైసిపి శ్రేణులు ఖండిస్తూ ఇదంతా ఒక కట్టు కథ అంటూ తెలుపుతున్నారు..