ప్రస్తుతం లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఇలాంటి బందోబస్తు ఏదీ లేదు. ఎన్నికల సంఘం, బీజేపీ పర్మిషన్ తోటి లోకేష్ తన పక్కన గన్మెన్లను ఉంచుకోగలిగారు. వీరితో ఊర మాస్ లెవెల్ లో లోకేష్ మంగళగిరి జిల్లా అంతటా తిరుగుతున్నారు. ఆయన టూర్స్ ఆయన అడిగేస్తే మాస్ అనే రేంజ్ లో ఉంటున్నాయి. మరోవైపు లోకేష్ మామయ్య బాలయ్య హిందూపురం ప్రాంతంలో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
నిజానికి వీరు కూడా రాష్ట్రమంతటా తిరగాల్సి ఉంది కానీ అంత అవసరం లేదని చంద్రబాబు నాయుడు ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీ సీఎం జగన్ ఒక్కరే ఎన్నికల ప్రచారాన్ని చేస్తున్నారు. చంద్రబాబు కూడా సింగిల్ గా ప్రచారం చేయడానికి పూనుకున్నారు. ఒక పార్టీ నుంచి ఒక నాయకుడు రాష్ట్రమంతటా తిరిగితే సరిపోతుందనే నమ్మకంతో వీరు ఉన్నారు. మరి ఈసారి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది. సర్వేలు మాత్రం జగన్ గెలిచే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నాయి. ప్రజల అభిప్రాయాల సేకరణలో కూడా జగన్ ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.