ఈ క్రమంలోనే నాలుగు రోజుల క్రితం విజయరాజు తీరు నిరసిస్తూ ఎంపీపీ పదవికి అశోక్బాబు భార్య విజయలక్ష్మితో పాటు అశోక్బాబు, ఇటు ఆయన వర్గం ప్రజాప్రతినిథులు, పార్టీ నేతలు తమ పార్టీ, ఇతర పదవులు అన్నింటికి రాజీనామాలు చేసేశారు. దీనిపై నియోజకవర్గంలో పెద్ద ముసలం రేగింది. పార్టీ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. వెంటనే జిల్లా పార్టీ కీలక నేతలు అందరూ అశోక్తో టచ్లోకి వచ్చి చర్చించే ప్రయత్నం చేశారు. చివరకు మంగళవారం చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్న జగన్ను అశోక్ కలిశారు.
పెద్దిరెడ్డి మిథున్రెడ్డి సమక్షంలోనే చిన్నభేటీ కూడా జరిగింది. అశోక్ నియోజకవర్గంలో పార్టీ పరంగా జరుగుతున్న పరిణామాలతో పాటు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడి.. పార్టీని నాలుగేళ్లలో నష్టపరిచిన వారిని విజయరాజు ఎంకరేజ్ చేస్తే ఎన్నికల్లో పార్టీ నష్టపోతుందని చెప్పారు. వెంటనే జగన్ మిథున్రెడ్డితో అశోక్ అన్న పార్టీకి అక్కడ చాలా ప్లస్.. ఆయన పార్టీకి నష్టపరిచే చర్యలు ఎంత మాత్రం చేయడు... పార్టీకి ఎవరు ప్లస్ అవుతారో వారందరిని పార్టీలోకి తీసుకోవాలని.. పార్టీని నష్టపరిచే వారు మనకు అవసరం లేదని ఆ నిర్ణయాన్ని ఆయనకే వదిలేయాని నేరుగా చెప్పేశారు.
ఇక నియోజకవర్గంలో పార్టీ పరంగా ఉన్న చిన్న చిన్న డిస్టబెన్సెలను చూడాలని కూడా జగన్ మిథున్రెడ్డితో చెప్పారు. అలాగే నియోజకవర్గంలో పార్టీ గెలుపు, ఇతర విషయాలు ఎలా ఉన్నాయ్ అన్నా అని కూడా జగన్ అశోక్ను అడిగి తెలుసుకున్నారు. మరి అశోక్ వర్గం తన రాజీనామాలను ఎలా ? ఎప్పుడు వెనక్కు తీసుకుని ఎన్నికల కార్యక్షేత్రంలో యాక్టివ్ అవుతుందో చూడాలి.