అమరావతి రాజధాని కావాలంటూ మహిళలతో రోజూ దీక్షలు.. ఉదయం లేచింది మొదలు.. అక్కడే అమరావతి మహిళలతో కూర్చొని , అల్పాహారం చేసి, ఫోటోలు దిగి ఆ తర్వాత వెళ్ళిపోతున్నారు.. ఈ తతంగం అంతా చాలా రోజులుగా జరుగుతోంది. చాలా పగడ్బందీగా ఈ ప్లాన్ తో ముందుకు వెళ్తోంది టీడీపీ.. అయితే ఇందుకు కౌంటర్ గా వైసీపీ పార్టీ బహుజన కార్యక్రమం అంటూ మూడు రాజధానుల విషయాన్ని ప్రస్తావిస్తూ అక్కడే కొంతమందితో టీడీపీకి వ్యతిరేకంగా ఒక శిబిరాన్ని ఏర్పాటు చేసింది. . అయితే ఇక్కడ ఉన్న వారికి భోజనాలు, వారి యొక్క వసతులను మొత్తం పార్టీనే చూసుకొనేది.
అయితే బహుజన కార్యక్రమం మొదట్లో 100 మంది ఉండేవారు.. ఆ తర్వాత నెమ్మదిగా తగ్గుకుంటూ చివరికి వారిని పార్టీ పట్టించుకోలేదని తెలిసి మూడు రాజధానుల అనే శిబిరం వాళ్లు వెళ్లి ఏకంగా తెలుగుదేశం పార్టీ లో చేరి పరిపాలన రాజకీయంతో లాభం జరుగుతుందని మోసపోయామంటూ.. బహుజన కార్యక్రమం నేత మాజీ నేత గురునాథం తెలియజేశారు. గుంటూరు నగరం జిల్లాలో దాదాపుగా నాలుగేళ్ల పాటు కొనసాగిన మూడు రాజధానుల శిబిరాన్ని ఎత్తేస్తున్నట్లు వైఎస్ఆర్సిపి పరిరక్షణ నేతలు ప్రకటించారు. అలాగే తెలుగుదేశం లో విలీనం చేస్తున్నట్లుగా కూడా గురునాథం ప్రకటించారు. దీంతో అక్కడి నేతలు నిన్నటి రోజున మంగళగిరిలో వారందరికి కండువా కప్పి సాదరంగా టీడీపీ లోకి ఆహ్వానించారు.. ఇక్కడ జరిగే పరిణామాలను బట్టి చూస్తే లోకేష్ మైలేజ్ బాగా పెరిగిందని అర్థమవుతుంది. మరి ఇక్కడి వారిని జగన్ ఎలా తనవైపు తిప్పుకుంటారో చూడాలి.