వాలంటీర్ల చేత పింఛను పంపిణీ చేయించకూడదని నిమ్మగడ్డ ఈసీకి రాసిన లేఖ వల్ల రాష్ట్రంలోని వృద్ధులు, దివ్యాంగులు పడిన ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. చంద్రబాబుకు మేలు చేయాలని నిమ్మగడ్డ చేసిన ఈ పని వల్ల టీడీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. రాష్ట్రంలో దాదాపుగా 33 మంది వృద్ధులు చనిపోవడానికి పరోక్షంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాసిన లేఖ కారణమని చెప్పవచ్చు.
వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేసే ఛాన్స్ లేకపోవడంతో రాష్ట్రంలో చాలామంది వాలంటీర్లు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే రాజీనామా చేసిన వాలంటీర్లు పోలింగ్ బూత్ లలో ఎన్నికల ఏజెంట్లుగా కూర్చోవడానికి అనుమతి ఇవ్వకూడదంటూ నిమ్మగడ్డ ఈసీకి మరో లేఖ రాశారు. నిమ్మగడ్డ రాసిన లేఖ వ్యక్తుల ప్రాథమిక హక్కులను హరించేలా ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
వాలంటీరు ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత ఎన్నికల ఏజెంట్ గా పని చేయాలో లేదో ఆ వ్యక్తి వ్యక్తిగత ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాసిన లేఖ విషయంలో ఈసీ ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. వాలంటీర్లను పదేపదే టార్గెట్ చేస్తూ నిమ్మగడ్డ టీడీపీకి చేటు చేస్తున్నారని టీడీపీ నేతలు భావిస్తున్నారు. నిమ్మగడ్డ విషయంలో చంద్రబాబు జాగ్రత్త పడకపోతే మాత్రం టీడీపీకి కొత్త కష్టాలు మొదలైనట్లేనని చెప్పవచ్చు.