అయితే కాసాని జ్ఞానేశ్వర్ మినహా కొండ విశ్వేశ్వర్ రెడ్డి, రంజిత్ కుమార్ రెడ్డిలు ఇద్దరు కూడా గతంలో బిఆర్ఎస్ పార్టీ తరఫున చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గెలిచిన వారరే. 2014లో కొండా విశ్వేశ్వర్ రెడ్డి, 2019లో రంజిత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల నుంచి విజయం సాధించారు. ఈ క్రమంలోనె ఇప్పుడు ఎవరు విజేతగా నిలుస్తారు అనేది ప్రస్తుతం ఆశక్తికరంగా మారిపోయింది. కాగా ఈసారి చేవెళ్లలో బిజెపికి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అటు రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. కాగా తన గెలుపు అవకాశాలపై ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బిజెపి అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి.
ఇటీవలే జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన కొండ విశ్వేశ్వర్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మోడీ మేనియా కొనసాగుతుంది అంటూ చెప్పుకోచ్చారు. ఇక చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో మోడీ మేనియా మరింత ఎక్కువగా ఉంది అంటూ తెలిపారు. ఇక్కడ ఏ అభ్యర్థిని బిజెపి తరఫున పోటీకి నిలబెట్టిన లక్ష మెజారిటీతో విజయం సాధిస్తారని.. కానీ తనకు లక్ష మెజారిటీ సరిపోదని అందుకే మూడు లక్షల మెజారిటీ తెచ్చుకుంటాను అంటూ శపథం చేశారు. చేవెళ్ల నుంచి తప్పకుండా 3 లక్షల పైచిలుక ఓట్ల మెజారిటీతో విజయం సాధించి చూపిస్తాను అంటూ ధీమా వ్యక్తం చేశారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి.